దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకల స్కెచ్..! ఎన్‌ఐఏ అలర్ట్..

| Edited By:

Jul 16, 2019 | 10:52 AM

దేశంలో ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారా..? సైలెంట్‌గా తమ పని కానిస్తున్నారా..? భారీ ప్రాణ నష్టం తప్పదా..? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. దీంతో.. అలర్ట్ అయిన జాతీయ దర్యాప్తు సంస్థలు గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు భారీగా అరెస్టులు చేస్తున్నారు. తేని, మధురై, పెరంబలూరు, తిరునల్వేలి, రామనాథపురంకు చెందిన 14 మందిని అరెస్ట్ చేశారు. అన్జారుల్లా అనే […]

దేశంలో భారీ విధ్వంసానికి ఉగ్రమూకల స్కెచ్..! ఎన్‌ఐఏ అలర్ట్..
Follow us on

దేశంలో ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారా..? సైలెంట్‌గా తమ పని కానిస్తున్నారా..? భారీ ప్రాణ నష్టం తప్పదా..? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. దీంతో.. అలర్ట్ అయిన జాతీయ దర్యాప్తు సంస్థలు గట్టి నిఘాను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.

తమిళనాడు వ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు భారీగా అరెస్టులు చేస్తున్నారు. తేని, మధురై, పెరంబలూరు, తిరునల్వేలి, రామనాథపురంకు చెందిన 14 మందిని అరెస్ట్ చేశారు. అన్జారుల్లా అనే తీవ్రవాద సంస్థతో సంబంధాలు, ఆ సంస్థకు నిధుల సమీకరణలు, ఇతర తీవ్రవాద కార్యకలాపాలతో వారందరికీ లింక్ వున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి పలు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ 14 మందిని జులై 25 వరకు రిమాండ్‌లో వుంచి విచారించనున్నట్లు సమాచారం. కాగా.. నిన్నకూడా నలుగురు అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.