Free Mobile Data To Students : విద్యార్థులకు ఉచిత 2జీబీ మొబైల్ డాటా.. ఎక్కడో..? ఎందుకో తెలుసా..?

రాష్ట్రంలోని విద్యార్థులంద‌రికీ రోజుకు 2జీబీ మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రక‌టించారు...

Free Mobile Data To Students : విద్యార్థులకు ఉచిత 2జీబీ మొబైల్ డాటా.. ఎక్కడో..? ఎందుకో తెలుసా..?

Edited By:

Updated on: Jan 10, 2021 | 1:07 PM

రాష్ట్రంలోని విద్యార్థులంద‌రికీ రోజుకు 2జీబీ మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రక‌టించారు. విద్యార్థులు జనవరి 10 నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు ఈ ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక‌ట‌న ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంద‌ని సీఎం చెప్పారు. కొవిడ్ -19 విస్తర‌ణ‌ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల‌తోపాటు త‌మిళ‌నాడులోనూ విద్యాసంస్థలు మూత‌ప‌డ్డాయి.

 

క‌రోనా ప్రభావం ఇప్పటికీ పూర్తిగా త‌గ్గక‌పోవ‌డంతో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. కాగా, త‌మిళ‌నాడులో యూజీ, పీజీ విద్యార్థులకు త‌ర‌గ‌తులు ప్రారంభమైనా.. ఎక్కువ మంది ఆన్‌లైన్‌ పాఠాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాలేజీలతోపాటు స్కాలర్‌షిప్‌ల‌తో చదువుకునే ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత మొబైల్ డేటా ఈ సౌలభ్యం అందించ‌నున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

Also Read:  Bird Flu Outbreak: దేశంలో 7 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు ప్రకటించిన కేంద్రం, ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం