Army Vehicle Accident: సిక్కింలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం, నలుగురు జవాన్లు మృతి..

|

Sep 05, 2024 | 5:01 PM

రెనోక్ రోంగ్లీ రాష్ట్ర రహదారి వెంబడి దలోప్‌చంద్ దారా సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ వాహనం రోడ్డుపై నుంచి 300 అడుగుల మేర లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆర్మీ అధికారులు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Army Vehicle Accident: సిక్కింలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం, నలుగురు జవాన్లు మృతి..
Army Vehicle Accident
Follow us on

సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ వాహనం పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని పాక్యోంగ్ జిల్లాలోని సిల్క్ రూట్‌లో జులుక్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెనోక్ రోంగ్లీ రాష్ట్ర రహదారి వెంబడి దలోప్‌చంద్ దారా సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ వాహనం రోడ్డుపై నుంచి 300 అడుగుల మేర లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆర్మీ అధికారులు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సిబ్బంది అంతా పశ్చిమ బెంగాల్‌ బినాగురిలోని ఎన్‌రోట్ మిషన్ కమాండ్ విభాగానికి చెందినవారు.

గతేడాది కూడా లడఖ్‌లో ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. ఆగస్టులో భారత ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. లేహ్‌ సమీపంలోని క్యారీ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఆర్మీ వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అందులో జేసీఓ (జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్) కూడా ఉన్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..