జర్నలిస్టుపై దేశద్రోహం కేసు, అరెస్టు

| Edited By: Pardhasaradhi Peri

Oct 07, 2020 | 4:06 PM

హత్రాస్ ఘటనను కవర్ చేసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ పై పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల..

జర్నలిస్టుపై దేశద్రోహం కేసు, అరెస్టు
Follow us on

హత్రాస్ ఘటనను కవర్ చేసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ పై పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కూడా మరో కేసు పెట్టారు. కేరళ లోని ఓ వెబ్ సైట్ కి కంట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న కప్పన్ కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి కూడా. కప్పన్ ని వెంటనే విడుదల చేయాలని కేరళ జర్నలిస్టులు కోరినప్పటికీ పోలీసులు నిరాకరించారు.