Liquor Policy Scam: లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియాకు ఎదురు దెబ్బ.. ఇద్దరు మంత్రుల రాజీనామా ఆమోదించిన కేజ్రీవాల్‌..

|

Feb 28, 2023 | 6:32 PM

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోదియాకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్​పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.

Liquor Policy Scam: లిక్కర్‌ స్కాంలో మనీష్‌ సిసోడియాకు ఎదురు దెబ్బ.. ఇద్దరు మంత్రుల రాజీనామా ఆమోదించిన కేజ్రీవాల్‌..
Manish Sisodia
Follow us on

లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తన పదవికి రాజీనామా చేశారు. సీబీఐ తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులో పిటిషన్‌ వేసుకోవచ్చని సూచించింది. ఇదే సమయంలో జైల్లో ఉన్న మరో మంత్రి సత్యేంద్రజైన్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఢిల్లీ జైలులో ఉన్నారు సత్యేంద్రజైన్‌. కేజ్రీవాల్‌ కేబినెట్‌లో కీలకమైన విద్యాశాఖను సిసోడియా నిర్వహించారు. సత్యేంద్రజైన్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు.

ఢిల్లీ​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 నూతన మద్యం పాలసీ కొత్త విధానంలో అనేక అక్రమాలు జరిగాయని గతేడాది జులైలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అప్పట్లో రిపోర్టు ఇచ్చారు. కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేసినట్లుగా ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అబ్కారీ శాఖ ఇన్​ఛార్జ్​ మంత్రిగా ఉన్న మనీశ్​ సిసోదియా పేరునూ ఇందులో ప్రధానంగా చేర్చారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్​ కుమార్​ సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేయడంతో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈ లిక్కర్ స్కాం కేసులో పలువురు నేతలతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. చివరకు ఈ ఎక్సైజ్​ నూతన పాలసీ విధానాన్ని ఢిల్లీలోని ఆప్​ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

లైవ్ వీడియో కోసం ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం