ఆర్జీకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడికి జీవితఖైదు విధింపుపై అటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగగా.., ఇటు బెంగాల్ ప్రభుత్వం కూడా భగ్గుమంటోంది. విచారణలో భాగంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలి మృతదేహంపై మరో మహిళ DNA ఉన్నట్లు రిపోర్ట్ రావడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో దోషిగా తేలిన సంజయ్రాయ్ DNA మృతురాలి శరీరంపై 100 శాతం ఉండగా, మరికొంత స్ధాయిలో ఓ మహిళ DNA సైతం బయటపడింది. దీంతో అది పొరపాటున ఈ DNAతో కలిసిందా? లేక సదరు మహిళ కూడా ఈ నేరంలో భాగమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు జూనియర్ వైద్యురాలి తండ్రి ఈ కేసులో మరికొందరు ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్ సేకరించలేదని.. కేసు ఛేదించడానికి CBI సరిగ్గా ప్రయత్నించడం లేదన్నారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా DNA రిపోర్టులో వెల్లడైందని అధికారులు తనకు చెప్పారన్నారు
-2024, ఆగస్టు 9న జరిగిన హత్యాచార ఘటనలో ఆస్పత్రిలోని CCTVలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి, జీవిత ఖైదు విధించింది.
మృతురాలి తండ్రి వెర్షన్
===========
హత్యాచారం తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు ఎంతలా వెల్లువెత్తాయో..తీర్పు తరువాత కూడా అంతే స్ధాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. తీర్పు నేపధ్యంలో పలు డిమాండ్లు కూడా తెరపైకి వస్తున్నాయి.
ప్రజల నుంచి వ్యక్తమవుతున్న డిమాండ్స్…
మరి ఆందోళనలు, పై కోర్టులో సవాళ్ల నేపధ్యంలో ఏం జరుగుతోందోనన్న ఆసక్తి నెలకొంది.. మరోవైపు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆగదంటున్నారు విద్యార్ఠులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..