Farm Laws: కేంద్రానికి అక్టోబర్ 2 వరకు గడువిచ్చాం.. ఒత్తిడితో చర్చలు జరపలేం: రైతు సంఘం నేత తికాయత్

|

Feb 06, 2021 | 3:57 PM

Farmers protest - Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2 వరకు సమయమిచ్చామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్..

Farm Laws: కేంద్రానికి అక్టోబర్ 2 వరకు గడువిచ్చాం.. ఒత్తిడితో చర్చలు జరపలేం: రైతు సంఘం నేత తికాయత్
Rakesh Tikait
Follow us on

Farmers protest – Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2 వరకు సమయమిచ్చామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగుతుందని.. ఆ తర్వాత ప్రణాళికను రచిస్తామని ఆయన స్పష్టంచేశారు. శనివారం నిర్వహించిన చక్కా జామ్ ఆందోళనలో భాగంగా తికాయత్ ఘాజీపూర్ బోర్డర్‌లో మాట్లాడారు. ఆందోళనలు విరమించాలంటూ తమపై ఒత్తిడి చేస్తే ప్రభుత్వంతో చర్చలు జరపలేమంటూ ఆయన స్పష్టంచేశారు. అక్టోబరు 2 వరకు కేంద్రానికి గడువిచ్చామని.. ఆతర్వాత ప్రణాళిక రచిస్తామని ఆయన తెలిపారు. అయితే ఆందోళన హింసాత్మకంగా మార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని తికాయత్ ఆరోపించారు.

Also Read:

Chakka Jam: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘చక్కా జామ్’.. పలుచోట్ల కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..

పంజాబీ నటుడు దీప్ సిద్దు ఏడీ ? విదేశాల నుంచి ఫేస్ బుక్ లో వీడియోలు నింపుతున్న లేడీ !