
భారత్లోని బంగారు గనులు అనే ప్రస్థావన వస్తే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే మొదటి పేరు కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. కానీ ఇప్పుడు ఈ పేరు వెనక్కి దొబ్బి మరో రాష్ట్రం పేరు తెరపైకి వస్తోంది. అవును, మన దేశంలోని ఒక రాష్ట్రంలో భారీగా బంగారు గనులు, నిల్వలు బయటపడుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రెండు గనులు ఉండగా తాజాగా మరో బంగారు గని బయటపడింది. అదే రాజస్థాన్లోని బాన్స్వాడ జిల్లాలో ఇటీవల బయటపడిన 3వ బంగారు గని. బాన్స్వాడ జిల్లాలోని ఘటోల్ – కంకారియా గ్రామంలో 3వ బంగారు గని గుర్తించారు భూగర్బ శాస్త్రవేత్తలు.
బాన్స్వాడ జిల్లాలోని ఘటోల్ – కంకారియా గ్రామంలో బయటపడిన ఈ గనిలో 3 చ.కి.మీ విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిల్వలు ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. మైనింగ్ లైసెన్స్ జారీ అయిన వెంటనే ఖనిజం వెలికితీత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపటనున్నారు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం, 940.26 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మొత్తం ప్రాంతంలో 113.52 మిలియన్ టన్నులు బంగారు ఖనిజం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఖనిజంను ప్రాసెస్ చేస్తే మొత్తం 222.39 టన్నుల బంగారు లోహం లభించవచ్చని.. కంకారియా-గారా ప్రాంతంలో 205 హెక్టార్లలో 1.24 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఈ గనిలో బంగారంతో పాటు, అనేక ఇతర సహ-ఖనిజాలు కూడా వెలికితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కనుగొనబడిన ఈ గనితో దేశంలో బంగారం ఉత్పత్తిలో రాజస్థాన్ వాటా మరో 25 శాతంకు పెరగనుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.