
ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీ, మరణించిన వారిని అధికారికంగా అమరవీరులుగా గుర్తించాలనే డిమాండ్కు మద్దతు ఇచ్చారు. “పహల్గామ్ దాడిలో మరణించిన వారి కుటుంబాల దుఃఖంలో, వారికి అమరవీరుల హోదా కోసం వారు చేస్తున్న డిమాండ్లో నేను అండగా నిలుస్తున్నాను.
ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఈ గౌరవం ఇవ్వడం ద్వారా వారి మనోభావాలను గౌరవించాలని ప్రధానమంత్రిని అభ్యర్థిస్తున్నాను” అని గాంధీ ఎక్స్లో చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. పహల్గామ్ దాడి బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిశారు. బుధవారం తెల్లవారుజామున కాన్పూర్లోని పహల్గామ్ దాడి బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి, మరణించిన వ్యక్తికి అమరవీరుడి హోదా ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. “నేను కాన్పూర్లో ఒక బాధిత కుటుంబాన్ని కలిశాను. వారు నన్ను నరేంద్ర మోదీకి సందేశం పంపమని అడిగారు.
ఆ కుటుంబాలన్నింటి తరపున, నేను ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్నాను.. ‘ఉగ్రదాడిలో మరణించిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని, వారికి గౌరవం ఇవ్వాలని మేం కోరుకుంటున్నాం” అని రాహుల్ అన్నారు. కాన్పూర్లోని శుభం ద్వివేది కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించారు. పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు.
पहलगाम हमले में मारे गए लोगों के परिवारों के दुख में, शहीद के दर्जे की उनकी मांग में, मैं साथ खड़ा हूं।
प्रधानमंत्री से आग्रह है कि वो इस त्रासदी में जान गंवाने वालों को यह सम्मान देकर उनके परिवारों की भावना का आदर करें। pic.twitter.com/auMEehEnOO
— Rahul Gandhi (@RahulGandhi) May 1, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి