ఆ సీరియల్ ప్రసారాలు నిలిపివేయండి.. పంజాబ్‌లో ఆందోళన

| Edited By:

Sep 07, 2019 | 6:12 PM

వాల్మీకి.. ఇది లేటెస్ట్ టాలీవుడ్ మూవీ. ఈ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. శనివారం అక్కడ బంద్ కూడా పాటించారు. ఇంతకీ విషయమేంటంటే.. కలర్స్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న “రామ్ సియా కే లవ్ కుశ” టెలీ సీరియల్ ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని పంజాబ్‌లో ఒక ఆందోళన జరుగుతోంది. ఈ సీరియల్‌లో రామాయాణానికి చెందిన అంశాలు సరిగ్గా లేవని, […]

ఆ సీరియల్ ప్రసారాలు నిలిపివేయండి.. పంజాబ్‌లో ఆందోళన
Follow us on

వాల్మీకి.. ఇది లేటెస్ట్ టాలీవుడ్ మూవీ. ఈ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్‌లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. శనివారం అక్కడ బంద్ కూడా పాటించారు. ఇంతకీ విషయమేంటంటే.. కలర్స్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న “రామ్ సియా కే లవ్ కుశ” టెలీ సీరియల్ ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని పంజాబ్‌లో ఒక ఆందోళన జరుగుతోంది. ఈ సీరియల్‌లో రామాయాణానికి చెందిన అంశాలు సరిగ్గా లేవని, అవి చరిత్రను వక్రీకరించే విధంగా ఉన్నాయంటూ పంజాబ్‌లోని వాల్మికి కమ్యూనిటీ రోడ్డెక్కింది.

రామాయణాన్ని వివరించడంలో తప్పులేదని, కానీ వాటిలో నిజానిజాలను కూడా సరిగ్గా చెప్పాలంటూ ఆ వర్గానికి చెందిన వారు డిమాండ్ చేస్తున్నారు. శనివారం బంద్ సందర్భంగా స్కూళ్లు,హాస్పిటల్స్‌కు మినహాయింపు ఇచ్చినట్టుగా వారు చెప్పారు.