Curfew violators: ‘కోవిడ్ కర్ఫ్యూను ఉల్లంఘిస్తే ‘రామ్, రామ్’ అని రాయాలట, మధ్యప్రదేశ్ లో పోలీసుల వింత శిక్ష
మధ్యప్రదేశ్ లో 'కోవిడ్ కర్ఫ్యూను' ఉల్లంఘిస్తున్నవారికి పోలీసులు వింత శిక్షను విధిస్తున్నారు. కోవిద్ ఆంక్షలు అతిక్రమించినవారు అరగంటసేపు కూర్చుని 'రామ్ రామ్' అని రాయాలని, లేదంటే గంట సేపు కూర్చోవాలని, జరిమానా చెల్లించాలని కోల్గావన్ పోలీసు స్టేషన్ కు చెందిన సంతోష్ సింగ్
మధ్యప్రదేశ్ లో ‘కోవిడ్ కర్ఫ్యూను’ ఉల్లంఘిస్తున్నవారికి పోలీసులు వింత శిక్షను విధిస్తున్నారు. కోవిద్ ఆంక్షలు అతిక్రమించినవారు అరగంటసేపు కూర్చుని ‘రామ్ రామ్’ అని రాయాలని, లేదంటే గంట సేపు కూర్చోవాలని, జరిమానా చెల్లించాలని కోల్గావన్ పోలీసు స్టేషన్ కు చెందిన సంతోష్ సింగ్ అనే ఎస్ఐ నిబంధన విధించాడు. అయితే జరిమానా, గంటసేపు కూర్చునే కన్నా ఇదే బాగుందని చాలామంది రామ్ రామ్ అని రాసి చక్కాపోతున్నారట.అయితే ఇందులో మతపరమైన సెంటిమెంట్లు ఏవీ లేవని, వాటిని దెబ్బ తీసే ఉద్దేశం లేదని ఆయన అంటున్నాడు. రామ్ రామ్ అని రాయడానికి విముఖత చూపేవారు ఫైన్ చెల్లించాలని ఆయన కోరుతున్నాడు. కాగా ఈ ఎస్ఐ గురించి ఎవరూ ఫిర్యాదు చేయకపోగా సంతోషంగా ఈ వింత శిక్షను అనుభవించి వెళ్తున్నారట..ఈ పోలీసాయన ‘రామభక్తి’ బాగానే పాపులర్ అవుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కోవిద్ కర్ఫ్యూ పేరిట ఇది అమలవుతోంది. అయితే ఇలాంటి శిక్షలను పోలీసులు తమకు తాము విధిస్తున్నారా లేక ఉన్నతాధికారుల అనుమతి కూడా ఉందా అన్నది తెలియడంలేదు. కొన్ని చోట్ల కర్ఫ్యూను ఉల్లంఘించినవారిని గుంజీలు తీయిస్తున్నారు.అటు దేశంలో కోవిద్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.వివిధ దేశాల నుంచి అందుతున్న కోవిద్ సాయాన్ని ప్రభుత్వం వినియోగించుకుంటోంది. అలాగే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఇస్తున్న విరాళాలను కూడా సర్కార్ ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత మాత్రం పీడిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Prabhas Adipurush video : ప్రాణాలు రిస్క్లో పెట్టలేను డార్లింగ్.. ఆదిపురుష్ కు తప్పని కష్టాలు..నిర్మాతలను ఒప్పించినా ప్రభాస్ ..(వీడియో).