ఉగ్రవాదంపై పోరులో ఏకమన దేశం.. సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్‌ సింధూర్‌ ఒక ప్రతీకః మోదీ

నేడు దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత నిర్వహించిన తొలి మన్‌కీ బాత్‌ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు

ఉగ్రవాదంపై పోరులో ఏకమన దేశం.. సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్‌ సింధూర్‌ ఒక ప్రతీకః మోదీ
Pm Narendra Modi Mann Ki Baat

Updated on: May 25, 2025 | 3:02 PM

నేడు దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత నిర్వహించిన తొలి మన్‌కీ బాత్‌ మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యం ప్రదర్శించిన పరాక్రమం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త విశ్వాసం, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య కాదు, ఇది మన దృఢ సంకల్పం, ధైర్యం, మారుతున్న భారతదేశం ఇమేజ్‌కి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. మన సైనికులు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. అది వారి అజేయమైన ధైర్యం, భారతదేశంలో తయారైన ఆయుధాలు, పరికరాలు, సాంకేతికత శక్తి దీనికి కారణం. దానికి స్వావలంబన భారతదేశం అనే దార్శనికత ఉంది. ఈ విజయంలో మన ఇంజనీర్లు, మన సాంకేతిక నిపుణులు, అందరి చెమటోడ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలపై ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే, అనేక కుటుంబాలు దానిని తమ జీవితాల్లో ఒక భాగంగా చేసుకున్నాయి. బీహార్‌లోని కతిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్, అనేక ఇతర నగరాల్లో ఆ సమయంలో జన్మించిన తమ బిడ్డలకు సింధూరి అని పేరు పెట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

మన్ కీ బాత్ కార్యక్రమం అక్టోబర్ 3, 2014న ప్రారంభించారు. ఇది ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియా, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పాష్టో, పర్షియన్, డారి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలతో పాటు 22 భారతీయ భాషలు, 29 మాండలికాలలో ప్రసారం అవుతోంది. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 500 కి పైగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ప్రసారం చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..