PM Modi: కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం కామెంట్‎పై మోదీ స్పందన..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తూ కేసీఆర్ పేల్చిన సంకీర్ణం బాంబ్.. నేషనల్ పాలిటిక్స్‌లో సైతం కదలిక తీసుకొచ్చింది. నామాకు కేంద్రమంత్రి యోగం ఉందన్న కేసీఆర్ మాటల్లో మర్మం ఏంటి అనే చర్చ మొదలైంది. కేంద్రంలో సంకీర్ణం వస్తోందన్న కేసీఆర్ జోస్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీవీ9 నెట్‌వర్క్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చారు మోదీ.

PM Modi: కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం కామెంట్‎పై మోదీ స్పందన..
Pm Modi
Follow us

|

Updated on: May 02, 2024 | 10:03 PM

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తూ కేసీఆర్ పేల్చిన సంకీర్ణం బాంబ్.. నేషనల్ పాలిటిక్స్‌లో సైతం కదలిక తీసుకొచ్చింది. నామాకు కేంద్రమంత్రి యోగం ఉందన్న కేసీఆర్ మాటల్లో మర్మం ఏంటి అనే చర్చ మొదలైంది. కేంద్రంలో సంకీర్ణం వస్తోందన్న కేసీఆర్ జోస్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీవీ9 నెట్‌వర్క్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చారు మోదీ. ఒకవేళ ఎన్‌డీఏ కూటమికి సీట్లు తగ్గి.. కాంగ్రెస్ కూటమి బలపడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే వస్తే కేసీఆర్ ఏం చేస్తారు..? ఇండియా కూటమిలో మాత్రం చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌కి మిగిలిన ఏకైక మార్గం ఎన్డీఏ కూటమే కనుక.. బీఆర్‌ఎస్-బీజేపీ రెండూ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో డ్రామాలాడుతున్నాయ్.. ఇదీ రేవంత్ లాజిక్.

కానీ.. కేసీఆర్ కోసం మోదీ తలుపులు తెరిచే ఉంటారన్న గ్యారంటీలు కూడా లేవట. ఇప్పటికే ఒకసారి కలిసుందాం రా అని కేసీఆర్ ఆఫరిచ్చినా తిరస్కరించి పంపాం.. మళ్లీ వచ్చినా అదే ఆన్సర్ అని తేల్చేశారు మోదీ. సో.. ఎన్‌డీఏలోకి రానిచ్చే ప్రసక్తే లేదని మోదీ తేల్చేశారు. ఇండీ కూటమిలోకి సైతం నో ఎంట్రీ బోర్డు అడ్డం పెట్టారు రేవంత్‌రెడ్డి. మరి.. మిగతా ప్రాంతీయ పార్టీల్ని కూడగట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి.. స్టీరింగ్ చేతికి తీసుకోవడమే కేసీఆర్ ముందున్న ఏకైక దారి. ఏదేమైనా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దక్కించుకునే సీట్ల సంఖ్యపైనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఆధారపడి ఉంటాయనేది పక్కా. కేంద్రంలో సంకీర్ణం వస్తుందని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ఆ పరిస్థితి వస్తే.. కేసీఆర్‌ను ఎన్‌డీఏలో మీరు చేర్చుకుంటారా? అని ‘ప్రధానమంత్రి అండ్‌ 5-ఎడిటర్స్‌’ ప్రోగ్రామ్‌లో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ మోదీని అడిగారు. ఆయన ఎప్పుడూ ఇటువంటి అబద్ధాలే చెబుతారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెప్పారు. నేను బహిరంగసభలోనే చెప్పాను. జీహెచ్‌ఎంసీ ఎన్నికలయ్యాక సీఎం కేసీఆర్ నా దగ్గరికి వచ్చారు. ఎన్‌డీఏలో చేరతా అన్నారు. కానీ.. నేను ఒక్కటే చెప్పా.. మున్సిపల్ ఎన్నికల్లో అపోజిషన్‌లో ఉండి పోరాడాం. వచ్చే ఎన్నికల్లో కూడా విపక్షంలోనే కొనసాగుతాం అని చెప్పాన్నారు ప్రధాని మోదీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..