PM Modi Invitation: ఢిల్లీ ఆర్ డే పరేడ్‌కు ముఖ్య అతిధిగా ఏపీ మెడికల్ విద్యార్ధిని.. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం..

ఏపీ మెడికల్ స్కాలర్‌కు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందుకోంది. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ..

PM Modi Invitation: ఢిల్లీ ఆర్ డే పరేడ్‌కు ముఖ్య అతిధిగా ఏపీ మెడికల్ విద్యార్ధిని.. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం..
PM Modi Invitation

Updated on: Jan 14, 2023 | 2:07 PM

ఏపీ మెడికల్ స్కాలర్‌కు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందుకోంది. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ మెయిల్‌ ద్వారా ఆమెకు తెలియజేశారు. జనవరి 26న న్యూఢిల్లీలోని ప్రధానితో కలిసి ఆర్-డే పరేడ్‌ను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆహ్వానం పలికింది. ఈ క్రమంలో విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోన్న డాక్టర్ బాణావతు తేజస్వి (27)కి కూడా ఎంపికైంది.

ఎవరీ డాక్టర్‌ తేజస్వి..

నున్నలోని కెన్నెడీ హైస్కూల్‌లో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, విజయవాడలోని భాష్యం హైస్కూల్‌లో 8 నుండి 10 వరకు, శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్త చేసింది. 2013 ఎంసెట్‌లో మెరిట్‌ సాధించిన తేజస్వి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. తేజస్వి కనబరచిన ప్రతిభకు డాక్టర్ వైఎస్‌ఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఆమెకు ఆరు గోల్డ్‌ మెడల్‌లు అందించింది. అనంతరం ఎయిమ్స్‌ జోధ్‌పూర్‌ జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పీజీలో కూడా గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. తేజస్వికి ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. తమ కూతురికి దక్కిన అరుదైన గౌరవం చూసి ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. డాక్టర్ తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇలాంటి అరుదైన ఆహ్వానం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు, కుటుంబం అందించిన సహకారం మరవలేనిదంటూ’ సంతోషం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us