
ఏదో ఆర్థిక తుఫాన్ దేశ తీరంలో సుడులు తిరుగుతోంది. ఏ క్షణాన్నైనా తీరం దాటొచ్చనే సంకేతమైతే కనిపిస్తోంది. ప్రధాని మోదీ చాలా క్యాజువల్గా చెప్పినట్టు కనిపించిన ఆ పొదుపు సూత్రాలు.. ఏదో ఆర్థిక విపత్తుకు, ప్రమాదానికి హింట్ ఇస్తున్నాయ్. పైగా.. ఆ 9 పొదుపు సూత్రాల్లోని ప్రతి ఒక్క పాయింట్ డాలర్కే కనెక్ట్ అవుతోంది. దేశ ఖజానాలో ఉన్న ప్రతి ఒక్క డాలర్ని కాపాడుకోవాలనే తాపత్రయం కనిపిస్తోంది. కారణం.. ఆ డాలర్లే కరిగిపోయిన నాడు దేశంలో ధరల విస్ఫోటనం జరుగుతుంది. ఉప్పు నుంచి ఉక్కు వరకు ప్రతి ఒక్క వస్తువు ధర పెరుగుతుంది. పైగా.. ఈసారి ఎల్నినో ముంచుకొస్తోంది. వందేళ్లలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తు రాబోతోంది. ఆ విపత్తుకు ఆర్థిక విపత్తు తోడైతే.. జరగబోయే నష్టం ఊహకు కూడా అందదు. అందుకేనా ఈ జాగ్రత్త. ఏదో ఆర్థిక విపత్తు రాబోతోందన్న సంకేతం కనిపిస్తోంది సరే. మరి.. ప్రజలు బంగారం కొనొద్దని అంత పర్టిక్యులర్గా ఎందుకన్నారు? ఓ ఏడాది పాటు గోల్డ్ కొనడం ఆపేద్దాం అని దేశ ప్రజలకు ఎందుకు పిలుపునిచ్చారు? రీజన్.. అదే పెద్ద ఇష్యూ కాబట్టి. ఆదివారం నాడు హైదరాబాద్లో ప్రధాని మోదీ ఆ మాట అనగానే దేశంలోని బంగారం వ్యాపారులంతా ఉలిక్కిపడ్డారు....