AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు అలర్ట్.. వెంటనే ఇది పూర్తి చేయండి.. లేదంటే 13వ విడత నిధులు రావు..

ఆర్థికంగా బలహీనంగా ఉండి, వ్యవసాయం సాగు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ, అప్పుల్లో కూరుకుపోతూ..

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు అలర్ట్.. వెంటనే ఇది పూర్తి చేయండి.. లేదంటే 13వ విడత నిధులు రావు..
లేదా.. PM కిసాన్ యోజన- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ కూడా రైతుల ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Shiva Prajapati
|

Updated on: Dec 07, 2022 | 1:23 PM

Share

ఆర్థికంగా బలహీనంగా ఉండి, వ్యవసాయం సాగు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ, అప్పుల్లో కూరుకుపోతూ ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తూ.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు ఏడాది రూ. 6 వేలు చొప్పున.. మూడు వాయిదాల్లో నగదు బదిలీ చేస్తోంది.

ఇప్పటి వరకు 12 వాయిదాలు చెల్లించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 13వ విడత డబ్బులు విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. 13వ విడత డబ్బు కోసం దేశ వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఎదరుచూస్తున్నారు. అయితే, రైతులు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఆ డబ్బు అకౌంట్‌లో పడకుండా నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి అలా జరగకుండా ఉండాలంటే రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

13వ విడత నిధులు ఎప్పుడు రావొచ్చు..?

12వ విడత పీఎం కిసాన్ నిధులు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు 13వ విడత నిధులు రానున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి అంటే ఈ నెలలోపు రైతుల ఖాతాల్లో 13వ విడతకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

వీరికి 13వ విడత డబ్బులు పడకపోవచ్చు..

1. భూమి ధృవీకరణ చేయని రైతులకు 13వ విడత వాయిదా డబ్బులు అందవు. అర్హత కలిగిన ప్రతి రైతు తమ భూములను ప్రభుత్వం చే ధృవీకరించుకోవాలి. తద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయి. అందుకే రైతులు ముందుగా ఈ పనిని పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే వాయిదా డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.

2. పీఎం కిసాన్ యోజనకు అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే పథకానికి సంబంధించి డబ్బులను పొందలేరు. ప్రతి లబ్దిదారుడు ఇది చేసుకోవాల్సిందే. ఒకవేళ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే చేసుకోవాలి. లేదంటే డబ్బులు జమ అవ్వవు.

3. ఈ-కేవైసీని చేయడం ఎలాగో తెలియకపోతే.. సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. అలా కాకుండా, పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in కి వెళ్లాలి. అందులోని సూచించిన విధంగా ఈ-కేవైసీని స్వయంగా పూర్తి చేసుకోవచ్చు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్