భావోద్వేగభరితమైన, గర్వించదగ్గ క్షణం.. భారత యువ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతాః మహాఆర్యమన్ సింధియా

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) కమాండ్ ఇప్పుడు ఒక నవయువకుడి చేతికి దక్కింది. కేవలం 29 సంవత్సరాల వయసులోనే మహాఆర్యమన్ సింధియా దాని అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడయ్యాడు. ఆయన గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన మహాఆర్యమన్ సింధియా. ఆయన తండ్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

భావోద్వేగభరితమైన, గర్వించదగ్గ క్షణం.. భారత యువ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతాః మహాఆర్యమన్ సింధియా
Mahaaryaman Scindia

Edited By:

Updated on: Sep 04, 2025 | 10:14 AM

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) కమాండ్ ఇప్పుడు ఒక నవయువకుడి చేతికి దక్కింది. కేవలం 29 సంవత్సరాల వయసులోనే మహాఆర్యమన్ సింధియా దాని అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడయ్యాడు. ఆయన గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన మహాఆర్యమన్ సింధియా. ఆయన తండ్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. తాత మాధవరావు సింధియా కూడా గతంలో MPCA అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన మహాఆర్యమన్ సింధియా మాట్లాడుతూ, ఇది చాలా భావోద్వేగభరితమైన, గర్వించదగ్గ క్షణం అన్నారు. ఒక ముఖ్యమైన బాధ్యతను స్వీకరించినందున మాత్రమే కాదు, ఈ పాత్ర బలమైన వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు కూడా అన్నారు. తాత మాధవరావు సింధియా ఈ పదవిని నిర్వహించారు. యువతలో ప్రతిభను గుర్తించడంలో, క్రీడా స్పూర్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. MPCA లో క్రికెట్ పరిపాలనకు వృత్తి నైపుణ్యం, నిర్మాణాత్మక ప్రక్రియలను తీసుకురావడం ద్వారా తండ్రి జ్యోతిరాదిత్య సింధియా దానిని మరింత ముందుకు తీసుకెళ్లారు. వారి ఆశీస్సులతో వారు నిర్మించిన క్రీడా ప్రపంచానికి విలువను జోడించడం, ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ పదవి మరింత బాధ్యతను పెంచిందన్నారు. జనాభాలో దాదాపు 70% మంది 35 ఏళ్లలోపు యువత ఉన్న దేశంలో యువకుడిగా.. తాజా దృక్పథాన్ని, శక్తిని తీసుకువస్తానని మహాఆర్యమన్ సింధియా తెలిపారు.

మహాఆర్యమన్ సింధియా తన పాఠశాల విద్యను డెహ్రాడూన్‌లోని దేశంలోని అత్యుత్తమ డూన్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి 2019లో యేల్ యూనివర్సిటీ (USA) నుండి పొలిటికల్ సైన్స్ అండ్ గవర్నమెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సమ్మర్ స్కూల్ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొన్నాడు. అక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్ చదివారు.

మహాఆర్యమన్ తన చదువుతో పాటు పని అనుభవాన్ని కూడగట్టుకుంటూనే ఉన్నాడు. ఆగస్టు 2014లో, అతను భూటాన్‌లోని గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ సెంటర్‌లో ఇంటర్న్‌షిప్ చేశాడు. దీని తర్వాత, అతను కొంతకాలం భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో కూడా పనిచేశాడు. తరువాత 2015లో, అతను లండన్‌లోని క్రిస్టీస్‌లో పనిచేశాడు. తరువాత 2016లో, అతను న్యూఢిల్లీలోని UIDAI (ఆధార్ కార్డ్ అథారిటీ)కి దోహదపడ్డాడు. 2017లో, అతను సాఫ్ట్‌ బ్యాంక్‌తో, 2018లో న్యూయార్క్‌లోని మాక్రో అడ్వైజరీ పార్టనర్‌లతో అనుభవాన్ని పొందాడు.

వీటితో పాటు, 2019 నుండి 2021 వరకు, అతను ముంబైలోని BCG (బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్)లో అసోసియేట్‌గా ఉన్నాడు. దీని తరువాత, అతను కుటుంబ వ్యాపారం, కొత్త స్టార్టప్‌లపై దృష్టి పెట్టాడు. అతను అండర్‌సౌండ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జై విలాస్ ప్యాలెస్‌లకు డైరెక్టర్ అయ్యాడు. 2022 సంవత్సరంలో, అతను టెక్ స్టార్టప్‌లను కూడా ప్రారంభించాడు. అంటే, అతను టెక్నాలజీ, వ్యాపార ప్రపంచంలో కూడా బలంగా ముందుకు అడుగు పెట్టాడు.

2022 సంవత్సరంలో, మహార్యమాన్ గ్వాలియర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ (GDCA) వైస్ ప్రెసిడెంట్‌గా తన ప్రస్తానాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరంలో, అతను MPCAలో జీవితకాల సభ్యుడయ్యాడు. 2024 సంవత్సరంలో, అతను మధ్యప్రదేశ్ T20 లీగ్‌ను ప్రారంభించాడు. ఇది రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు కొత్త వేదికను ఇచ్చింది. ఈ చొరవ క్రికెట్ పట్ల ఆయనకున్న ప్రేమను, నిర్వహణ పట్ల ఆయనకున్న అవగాహనను స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఆయన MPCA అధ్యక్షుడయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us