Online Games: ఆన్ లైన్ గేమ్స్ నియంత్రణపై పార్లమెంట్ లో ప్రశ్నల పరంపర దూసుకువచ్చింది. ఆన్ లైన్ గేమ్స్ ను నియంత్రించాలని 2021,డిసెంబర్ 3న కేంద్రాన్ని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కోరారు. అది సాధ్యం కాకుంటే ఆన్ లైన్ గేమింగ్ ఏకరూప(యూనిఫాం) పన్ను విధించాలని ఆయన సూచించారు.
పిల్లలు, యువతలో ఆన్ లైన్ గేమ్స్ వ్యసనం విపరీతంగా పెరిగిపోతుండడంపై ఆయన ఆందోలన్ వ్యక్తం చేశారు. ఆన్ లైన్ గేమ్స్ కు కోట్ల కొద్దీ పిల్లలు బానిసలుగా మారుతున్నారని పార్లమెంట్ లో వ్యాఖానించారు ఎంపీ. ఇది వారి భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆన్ లైన్ గేమింగ్ క్రమంగా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గా పరిణామం చెందాయన్న సభ్యుడు..యువత, పిల్లలు గ్యాంబ్లింగ్ పాల్పడుతూ డబ్బును వృథా చేస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇది నైపుణ్యానికి చెందిన ఆట లేదా అవకాశం దొరికితే ఆడే ఆటనా అన్న విషయాలు తేల్చాల్సిన అవసరం ఉందని సుశీల్ కుమార్ అన్నారు. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలుగా మారి విలువైన సమయం, డబ్బు కోల్పోతున్నారని పార్లమెంట్ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఆన్ లైన్ గేమింగ్ నిరోధించాల్సిన ఆవశ్యకతను ఆయన విస్పష్టంగా సభలో ప్రస్తావించారు.
ఆన్ లైన్ గేమ్స్ నియంత్రణకు సమగ్ర చట్టం చేస్తుందా ? లేదా పెరుగుతున్న ఆన్ లైన్ గేమింగ్ తో ఆదాయం సృష్టించే ఉపాయాలేమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా అన్నదే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రశ్నలు.
దేశంలో ఆన్ లైన్ గేమ్స్ తీరెలా ఉందో పరిశీలిస్తే..
ఆన్ లైన్ గేమ్స్ లో డబ్బులు మూడు రకాలుగా సర్క్యులేట్..
1. ఆన్ లైన్ గేమ్ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం దీనిపై ఆయా కంపెనీలు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాయి.
2. ప్రైజ్ మని పూల్ చేస్తారు.. అంటే గేమ్ లో పాల్గొని వ్యక్తులు నిర్ణీత మొత్తంలో డబ్బును జమచేస్తారు. గెలిచిన వారు ఈ మొత్తాన్ని తీసుకుంటారు. ఇది పన్ను పరిధిలోకి రాదు
3. ఆన్ లైన్ గేమ్స్ ఆడే సమయంలో పలు కంపెనీల ప్రకటనలు ప్రదర్శిస్తాయి. ఈ ప్రకటనల నుంచి ఆదాయంపై పన్ను ప్రభుత్వానికి అందుతుంది.
ప్రభుత్వం చట్టం చేసి ఈ మూడింటినీ కలిపి ఒక సింగిల్ టాక్స్ విధించవచ్చు
ప్రస్తుతం అందుకు విభిన్నం..
విమర్శలు..
రెండూ నైపుణ్యంతో కూడిన ఆటలే అంటున్న గేమింగ్ కంపెనీలు.
పేకాటలో కార్డ్స్ పంచడం, పాచికలు వేయడం, వేగంగా మొబైల్ బటన్స్ ప్రెస్ చేయడం నైపుణ్యంతో కూడిన ఆటలు అదృష్టం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు..
ఒకవేళ ప్రభుత్వం చట్టం చేస్తే రెండు రకాల గేమ్స్ పై 28శాతం పన్ను విధించే అవకాశం ఉందని వాదన
ఇదే జరిగితే తమ ఆదాయం తగ్గిపోతుందన్న ఆందోళన చెందుతున్న గేమింగ్ కంపెనీలు
2020లో జరిపిన ఓ సర్వేలో అసక్తికర విషయాలు..
చైనాలో కొత్త రూల్..
భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ నిషేధించడానికి ప్రయత్నించిన రాష్ట్రాలు ఇవే..
కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆన్ లైన్ గేమింగ్ పై ఆంక్షలు విధించాయి
కాని ఈ అంశాలు కోర్టుకు వెళ్లడంతో.. విభిన్న తీర్పులు రావడంతో ఆన్ లైన్ గేమింగ్ కొనసాగుతోంది
ఆన్ లైన్ రమ్మీని(జూదం) నిషేధించిన తెలంగాణ, ఏపీ, ఆస్సాం, ఒడిశా, నాగాలాండ్, సిక్కిం
దేశంలో ఏం చేస్తే మంచిది..
మొత్తమ్మీద ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ వ్యవహారం పార్లమెంట్ లో ప్రకంపనలు రేపింది. ఇక ప్రభుత్వం దీనిపై ఏ చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇవి కూడా చదవండి: Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం