Booster Dose: 40 ఏళ్లు దాటితే బూస్టర్ డోస్ తప్పనిసరి.. తేల్చి చెప్పిన ఇన్సాకోగ్ శాస్త్రవేత్తలు.. ఎప్పుడు ఇవ్వాలంటే?

Omicron Variant: రెండవ డోస్ తీసుకున్న 6 నుంచి 9 నెలల తర్వాత వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలి. ఎందుకంటే 6 నుంచి 9 నెలల్లో యాంటీబాడీస్ పతనంలో ఉంటాయి..

Booster Dose: 40 ఏళ్లు దాటితే బూస్టర్ డోస్ తప్పనిసరి.. తేల్చి చెప్పిన ఇన్సాకోగ్ శాస్త్రవేత్తలు.. ఎప్పుడు ఇవ్వాలంటే?

Updated on: Dec 03, 2021 | 8:42 PM

Booster Dose For High Risk Group: కరోనా కొత్త వేరియంట్ ముప్పుతో భారతదేశంలో కూడా బూస్టర్ డోస్ అందించాలని ప్రతిపాదించారు. ఇండియన్ SARS-Covid-2 జెనెటిక్ కన్సార్టియం (INSACOG) శాస్త్రవేత్తలు 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ మోతాదును సిఫార్సు చేశారు. 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని కన్సార్టియం తన నివేదికలో పేర్కొంది. ఇందులో ప్రమాదం ఎక్కువగా ఉన్న వారిపై దృష్టి సారించాలని సూచించారు. INSACOG అనేది కరోనా వైరస్ జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేబొరేటరీల అపెక్స్ బాడీ.

బూస్టర్ డోస్ ఎందుకు అవసరం?
పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మైక్రో వైరాలజీ విభాగం మాజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ, రెండవ డోస్ తీసుకున్న 6 నుంచి 9 నెలల తర్వాత వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలి. ఎందుకంటే 6 నుంచి 9 నెలల్లో యాంటీబాడీస్ పతనంలో ఉంటాయి. మనం వేసుకునే ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ కూడా ఏడాదిలో వేయడానికి కారణం ఇదేనని పేర్కొన్నారు.

దేశంలో బూస్టర్ డోస్ విధానం ఎప్పటి వరకు ఉంటుంది?
తీవ్రమైన రోగులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తుల కోసం టీకా అదనపు మోతాదు (బూస్టర్ డోస్)పై ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోందని దేశ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా తెలిపారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTG) ఈ విధానాన్ని 2 వారాల్లో సిద్ధం చేస్తుంది. దేశంలోని 44 కోట్ల మంది పిల్లలకు వ్యాక్సినేషన్‌ కోసం ఎన్‌టీఏజీ కొత్త విధానాన్ని కూడా తీసుకురానుంది.

Also Read: PM Modi: డిజిటల్ విప్లవం కరెన్సీ చరిత్రను మార్చేసింది.. ఇన్ఫినిటీ ఫోరం ప్రారంభించిన ప్రధాని మోడీ

FD vs IPO Investment: ఎఫ్‌డీల్లో డబ్బు ఐపీఓలకు.. మారిన పెట్టుబడిదారుల ధోరణి.. రూ. 2.67 లక్షల కోట్లు తగ్గిన బ్యాంకు డిపాజిట్లు..!

Loading...
Unable to load recommendations.
Follow Us