కూరగాయలు అమ్మారు.. ఉగ్రవాదిని పట్టుకున్నారు

| Edited By:

Aug 17, 2019 | 1:10 PM

ఉగ్రవాదులను మట్టబెట్టడం కోసం ఎన్ఐఏ అధికారులు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునేందుకు వారు మారు వేషాలు సైతం వేస్తున్నారు. తాజాగా జహిరుల్ షేక్ అనే ఉగ్రవాది కోసం అలాంటి మారు వేషాలే వేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇండోర్‌లోని బుర్ద్వాన్‌లో 2014లో జరిగిన బాంబు పేలుళ్లలో జహిరుల్ షేక్ కీలక నిందితుడు. అతడిని పట్టుకోవడం కోసం ఎన్‌ఐఏ అధికారులు ఎప్పటి నుంచో గాలింపు చర్యలను […]

కూరగాయలు అమ్మారు.. ఉగ్రవాదిని పట్టుకున్నారు
Follow us on

ఉగ్రవాదులను మట్టబెట్టడం కోసం ఎన్ఐఏ అధికారులు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునేందుకు వారు మారు వేషాలు సైతం వేస్తున్నారు. తాజాగా జహిరుల్ షేక్ అనే ఉగ్రవాది కోసం అలాంటి మారు వేషాలే వేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఇండోర్‌లోని బుర్ద్వాన్‌లో 2014లో జరిగిన బాంబు పేలుళ్లలో జహిరుల్ షేక్ కీలక నిందితుడు. అతడిని పట్టుకోవడం కోసం ఎన్‌ఐఏ అధికారులు ఎప్పటి నుంచో గాలింపు చర్యలను చేపట్టారు. అయితే ఇటీవల అతడు స్థానిక కోహినూర్ కాలనీలో నివాసం ఉన్నాడని వారికి సమాచారం అందింది. దీంతో వారు స్థానిక పోలీసులకు కూడా తెలీయకుండా సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించేశారు. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవంకు రెండు రోజుల ముందు అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ ఆపరేషన్ చేసే సమయంలో తమ అధికారులు కూరగాయలు కూడా అమ్మారని ఎన్‌ఐఏ తెలిపింది. ‘‘అజాద్ నగర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు సహాయం చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన భూస్వామి వివరాలు ఇంకా తెలియరాలేదు’’ అని అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరుణ్ కపూర్ తెలిపారు.

కాగా బంగ్లాదేశ్‌ ఉగ్ర సంస్థ జమాత్ ఉల్ ముజాహుదీన్‌‌లో జహిరుల్ షేక్ కీలక నేతగా వ్యవహరించాడు. ఈ క్రమంలో బుర్ద్వాన్ బాంబు పేలుళ్లతో పలు ప్రదేశాలకు అతడు బాంబులను సరఫరా చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇక పేలుళ్ల తరువాత తప్పించుకున్న జహిరుల్.. రెండు సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో పెయింటర్‌, కూలీగా పనిచేశాడు.