
సాధారణంగా.. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఆ ఫార్ములా ప్రకారం.. ‘ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దే వద్దు’ అంటూ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం జరుగుతుందనే ఆందోళన ఉంది. ఆ ఆందోళనను తగ్గించడానికి.. అసలు రాష్ట్రాల జనాభాతో సంబంధమే లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లను పెంచుతామంటోంది. ఆల్రడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎన్డీయే మీటింగ్లో దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం చొప్పున అసెంబ్లీ సీట్లు పెంచితే.. సపోజ్ ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే.. 2029 ఎన్నికలకి అసెంబ్లీ సీట్లు 263కి పెరుగుతాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 175. ఇందులో 50 శాతం అంటే.. దాదాపు 88 స్థానాలు పెరగొచ్చు. అంటే.. 175 ప్లస్ 88. మొత్తం 263 స్థానాలవుతాయి. ఇక లోక్సభ స్థానాల సంగతి. ఏపీలో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లున్నాయి. 25 సీట్లలో 50 శాతం అంటే.. 13 స్థానాలు పెరగాల్సి ఉంటుంది. 25 ప్లస్ 13.. మొత్తం 38 పార్లమెంట్ నియోజకవర్గాలకు 2029లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక తెలంగాణ సంగతి. తెలంగాణలో ఇప్పుడున్న అసెంబ్లీ సీట్లు 119. 50 శాతం పెంపుతో మరో 60 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే.. మొత్తం 179 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇప్పుడున్న లోక్సభ స్థానాల సంఖ్య...