Navjot Singh Sindu: రైతులకు మద్దతుగా.. ఇంటిపై నల్ల జెండాను ఎగురవేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
Farmers Protest - Farm Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 6 నెలలుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా పంజాబ్ ఎమ్మెల్యే
Farmers Protest – Farm Laws: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 6 నెలలుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా పంజాబ్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాటియాలా, అమృత్సర్లలోని తన నివాసాలపై మంగళవారం నల్లజెండాలను ఎగురవేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. రైతుల సమస్య పరిష్కారానికి కేంద్రం అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా ఆయన ఈ నల్లజెండాలను ఎగురవేసినట్లు సిద్ధూ ప్రకటించారు. పంజాబీలందరూ నల్లజెండాలను ఎగురవేసి రైతులకు మద్దతు తెలపాలని సిద్ధూ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన వీడియోను పంచుకున్నారు.
వీడియో..
Hoisting the Black Flag in Protest … Every Punjabi must support the Farmers !! pic.twitter.com/CQEP32O3az
— Navjot Singh Sidhu (@sherryontopp) May 25, 2021
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, గిట్టుబాటు ధరపై స్పష్టతనివ్వాలని రైతు సంఘాలు గతేడాది నవంబర్ నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. 40కిపైగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం చట్టాలను రద్దు చేసేంతవరకూ ఆందోళన విరమించేది లేదంటూ అన్నదాతలు స్పష్టంచేశారు. అయితే.. ఈ ఆందోళన ప్రారంభించి ఆరునెలలు అవుతున్న సందర్భంగా బుధవారం నల్ల జెండాలను ఎగురవేయాలని రైతు సంఘాలు పిలుపనిచ్చాయి. ఈ మేరకు సిద్ధూ తన ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేసి రైతులకు మద్దతు తెలిపారు.
Also Read: