AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: యుద్ధంపై కేంద్రం ఫోకస్‌.. ఆర్థికమంత్రితో ప్రధాని మోడీ సమావేశం..

రష్యా – ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై కేంద్రం ఫోకస్‌ పెట్టింది. కాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.

Russia Ukraine Crisis: యుద్ధంపై కేంద్రం ఫోకస్‌.. ఆర్థికమంత్రితో ప్రధాని మోడీ సమావేశం..
Pm Narendra Modi
Ravi Kiran
|

Updated on: Feb 24, 2022 | 5:48 PM

Share

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద ప్రభావంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం పరోక్షంగా ప్రపంచ దేశాలపై ప్రభావం చూపనుంది. ఈ యుద్దంతో ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో గురువారం సాయంత్రం కేంద్ర హోంశాఖ, రక్షణ, ఆర్ధిక మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముడి చమురు ధరలను తగ్గించే మార్గాలు, తాజాగా పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించనున్నారు.