‘ఆపరేషన్ సింధూర్’లో అమరవీరులు వీరే.. తొలిసారి ప్రకటించిన భారత ఆర్మీ.. వీరపుత్రులకు సముచిత స్థానం!

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ వీర సైనికుల త్యాగానికి అత్యున్నత గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం (National War Memorial)పై వీరి పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించనున్నారు. ఈ ఆరుగురు అమరవీరుల వివరాలను జాతీయ యుద్ధ స్మారక చిహ్నం అధికారిక వెబ్‌సైట్‌లో బహిరంగపరిచారు.

‘ఆపరేషన్ సింధూర్’లో అమరవీరులు వీరే.. తొలిసారి ప్రకటించిన భారత ఆర్మీ.. వీరపుత్రులకు సముచిత స్థానం!
Operation Sindoor Soldiers

Updated on: Jun 26, 2026 | 4:12 PM

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పరాక్రమాన్ని ప్రదర్శించి వీరమరణం పొందిన ఆరుగురు భారతీయ వీర సైనికుల త్యాగానికి అత్యున్నత గౌరవం దక్కింది. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం (National War Memorial)పై వీరి పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించనున్నారు. ఈ ఆరుగురు అమరవీరుల వివరాలను జాతీయ యుద్ధ స్మారక చిహ్నం అధికారిక వెబ్‌సైట్‌లో బహిరంగపరిచారు.

2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం “ఆపరేషన్ సింధూర్”ను ప్రారంభించింది. పాకిస్థాన్ తోపాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించింది. దేశ గౌరవాన్ని కాపాడేందుకు జరిగిన ఈ భీకర పోరాటంలో ఆరుగురు ధైర్యవంతులైన సైనికులు తమ ప్రాణాలను అర్పించి అమరులయ్యారు. ఈ ఆపరేషన్ సమయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (NSCS) కు కొత్త సైనిక సలహాదారుగా నియమితులయ్యారు.

అమరులైన ఆరుగురు వీరపుత్రులు

ఈ ఆపరేషన్‌లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణాలర్పించిన వారిలో ఐదుగురు భారత సైన్యానికి చెందిన జవాన్లు కాగా, ఒకరు భారత వైమానిక దళానికి (IAF) చెందిన సార్జెంట్ ఉన్నారు.

వారి వివరాలు:

  1. సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (భారత సైన్యం)
  2. రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (భారత సైన్యం)
  3. లాన్స్ నాయక్ దినేష్ కుమార్ (భారత సైన్యం)
  4. అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్ (భారత సైన్యం)
  5. హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (భారత సైన్యం)
  6. సార్జెంట్ సురేంద్ర కుమార్ (భారత వైమానిక దళం)

శౌర్య పురస్కారాలతో సత్కారం

ఆపరేషన్ సింధూర్‌లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇద్దరు వీరులకు ప్రభుత్వం మరణానంతరం సైనిక పురస్కారాలను ప్రకటించింది.

రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (వీరచక్ర): ఆపరేషన్ సమయంలో నియంత్రణ రేఖ (LoC) వద్ద మోహరించిన ఈయనకు దేశంలోనే మూడవ అత్యున్నత యుద్ధ శౌర్య పురస్కారమైన ‘వీరచక్ర’ దక్కింది. జూన్ 8న జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మరణానంతరం ప్రదానం చేశారు.

సార్జెంట్ సురేంద్ర కుమార్ (ఎయిర్ ఫోర్స్ మెడల్): వైమానిక దళంలో ఈయన అందించిన అసాధారణ సేవలకు, శౌర్యానికి గాను మరణానంతరం ‘ఎయిర్ మెడల్’ (వాయుసేన పతకం) తో ప్రభుత్వం సత్కరించింది.

‘త్యాగ చక్ర’లో శాశ్వత స్థానం

న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో ఉన్న ‘త్యాగ చక్ర’ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు అంకితం చేయడం జరిగింది. ఇది 16 వృత్తాకార గ్రానైట్ గోడలతో నిర్మించబడింది. దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు అమరులైన ప్రతి ఒక్క సైనికుడి పేరు, హోదా, వారి యూనిట్ వివరాలు ఇక్కడి గోడలపై ఉండే ప్రత్యేక ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇప్పుడు, ఆపరేషన్ సింధూర్‌కు చెందిన ఈ ఆరుగురు వీరపుత్రుల పేర్లు కూడా ఈ అద్భుతమైన స్మారక చిహ్నంలోని త్యాగచక్రంలో శాశ్వత భాగంగా నిలవబోతున్నాయి. దేశ భద్రత, సార్వభౌమత్వం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఈ వీర సైనికుల గాథలు రాబోయే తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us