Horrific Incident: ఇంట్లో భార్యను చంపి.. బిల్డింగ్పై నుంచి దూకి భర్త సూసైడ్! ఏం జరిగిందో..
భర్త బిల్డింగ్పై నుంచి దూకి రోడ్డుపై శవమై కనిపించాడు. అతని భార్యకు ఫోన్ చేస్తే ఎంతకు లిఫ్ట్ చేయలేదు. ఇంటికెళ్లి చూస్తే గదిలో విగత జీవిగా కనిపించింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు సెకన్ల వ్యవధిలో అంతా జరిగిపోయింది. ఈ షాకింగ్ ఘటన ముంబయిలోని గోరెగావ్లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
![Horrific Incident: ఇంట్లో భార్యను చంపి.. బిల్డింగ్పై నుంచి దూకి భర్త సూసైడ్! ఏం జరిగిందో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/man-kills-wife-and-died.jpg?w=1280)
ముంబై, ఆగస్టు 4: భర్త బిల్డింగ్పై నుంచి దూకి రోడ్డుపై శవమై కనిపించాడు. అతని భార్యకు ఫోన్ చేస్తే ఎంతకు లిఫ్ట్ చేయలేదు. ఇంటికెళ్లి చూస్తే గదిలో విగత జీవిగా కనిపించింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు సెకన్ల వ్యవధిలో అంతా జరిగిపోయింది. ఈ షాకింగ్ ఘటన ముంబయిలోని గోరెగావ్లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జవహర్ నగర్లోని టోపీవాలా మాన్షన్ ముందు రహదారిపై కిషోర్ పెడ్నేకర్ (58) అనే వ్యక్తి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించిగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మృతుడు కిషోర్ జిమ్ ఎక్విప్మెంట్ సేల్స్మెన్గా పని చేసేవాడని స్థానికులు తెలిపారు. అతడి మరణం గురించి ఆయన భార్యకు చెప్పేందుకు పలుమార్లు ఫోన్ చేయగా.. ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో ఈ దంపతులు నివాసం ఉంటున్న ఆ ఫ్లాట్కు పోలీసులు చేరుకున్నారు. అయితే ఫ్లాట్ డోర్కి లాక్ వేసి ఉంది. దీంతో మృతుడు కిషోర్ మెడలో డోర్ లాక్ ఉండటం గమనించిన పోలీసులు, ఆ కీ సహాయంతో తీసుకుని డోర్ లోపలికి ప్రవేశించారు. అయితే అక్కడి దృశ్యం చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే థెరపిస్ట్ అయిన కిషోర్ భార్య రాజశ్రీ (57) మృతి చెంది కనిపించింది. ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కిషోర్ తొలుత తన భార్యను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఢిల్లీలో పని చేస్తున్న కొడుకు కోసం కిషోర్ ఢిల్లీ నుంచి ముంబైకి విమాన టిక్కెట్ను కూడా బుక్ చేశాడు. అతడి బ్యాంకు ఖాతాల వివరాలు, వాట్సాప్ సందేశాల పోలీసులు తెలుసుకున్నారు. పైగా అతని ఫ్లాట్లో డిప్రెషన్, డయాబెటిస్కు సంబంధించిన మందులను పోలీసులు కనుగొన్నారు. తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న కిషోర్ ముందుగా నిర్ణయించుకున్న ప్లాన్ ప్రకారం.. భార్యను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఈ దంపతుల కుమారుడు ఢిల్లీలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.