మోర్బీ బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్‌ హైకోర్టు కీలక నిర్ణయం.. బాధితులకు పరిహారంగా..

ఇది న్యాయమని మీరు అనుకుంటున్నారా? ఇది న్యాయమా? మీరు స్వచ్ఛందంగా నష్టపరిహారం చెల్లించడానికి మీ సుముఖతను వ్యక్తం చేసారు. ఇది న్యాయమని మీరు అనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

మోర్బీ బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్‌ హైకోర్టు కీలక నిర్ణయం.. బాధితులకు పరిహారంగా..
Gujarat Morbi Bridge

Updated on: Feb 22, 2023 | 9:41 AM

మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించిన, గాయపడిన వారి బంధువులకు ఐదు కోట్ల రూపాయల మధ్యంతర నష్టపరిహారాన్ని వాచ్ మేకర్ ఒరెవా గ్రూప్ మంగళవారం గుజరాత్ హైకోర్టు ముందు అందించింది. అయితే కంపెనీ ఇచ్చే పరిహారం సమర్థమైనది కాదని హైకోర్టు పేర్కొంది. మోర్బీ నగరంలోని మచ్చు నదిపై నిర్మించిన బ్రిడ్జి గతేడాది అక్టోబర్ 30న కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 56 మంది గాయపడ్డారు. అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ (ఒరేవా గ్రూప్) గత ఏడాది దుర్ఘటన తర్వాత హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా మధ్యంతర నష్టపరిహారానికి హామీ ఇచ్చింది.

నష్టపరిహారాన్ని బాధితులకు పంచితే మృతుల కుటుంబీకులకు సుమారు రూ.3.5 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేస్తామని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా గోకాని, జస్టిస్‌ సందీప్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం ఇది న్యాయమైనదేనా? మీరు స్వచ్ఛందంగా నష్టపరిహారం చెల్లించడానికి మీ సుముఖతను వ్యక్తం చేసారు. ఇది న్యాయమని మీరు అనుకుంటున్నారా? ఇది న్యాయమా? మీరు స్వచ్ఛందంగా నష్టపరిహారం చెల్లించడానికి మీ సుముఖతను వ్యక్తం చేసారు. ఇది న్యాయమని మీరు అనుకుంటున్నారా? ఇది న్యాయమా? మీరు స్వచ్ఛందంగా నష్టపరిహారం చెల్లించడానికి మీ సుముఖతను వ్యక్తం చేసారు. ఇది న్యాయమని మీరు అనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

మృతుల బంధువులకు రాష్ట్ర, కేంద్రం ఇప్పటి వరకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.రెండు లక్షల చొప్పున పరిహారం ఇచ్చాయని సీనియర్ న్యాయవాది కమల్ త్రివేది కోర్టుకు తెలిపారు. మోర్బీ పోలీసులు ఒరేవా గ్రూప్ ఎండీ జయసుఖ్ పటేల్‌తో సహా పది మంది నిందితులను ఐపిసి సెక్షన్లు 304, 308, 336, 337 కింద అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us