Tamil Nadu: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..

తమిళనాడు విరుదునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని.. మంటలార్పుతున్నారు.

Tamil Nadu: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
Massive Explosion at Firecracker Unit in Virudhunagar

Updated on: Apr 19, 2026 | 5:41 PM

తమిళనాడు విరుదునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని.. మంటలార్పుతున్నారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసం అయింది.. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

విరుదునగర్ జిల్లాలో అనేక బాణసంచా కర్మాగారాలు ఉన్నాయి. ఈ కర్మాగారాలలో ఆ జిల్లాకు చెందిన అనేక మంది స్త్రీపురుషులు కార్మికులుగా పనిచేస్తున్నారు. బాణసంచా పరిశ్రమే వారి జీవనాధారం. ఈ నేపథ్యంలో, విరుదునగర్ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ముత్తు మునియాండికి చెందిన ‘వనజ’ అనే ప్రైవేటు బాణసంచా కర్మాగారం నడుస్తోంది. ఈ కర్మాగారంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది స్త్రీపురుషులు పనిచేస్తున్నారు. ఈరోజు, ఆదివారం ఉదయం (ఏప్రిల్ 19) వారంతా యధావిధిగా పనికి వచ్చారు. తమతమ కర్మాగారాల్లోని భవనాల్లో బాణసంచా తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ తరుణంలో, బాణసంచా కర్మాగారంలోని ఒక భాగంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. సెకన్ల వ్యవధిలోనే 4 భవనాలు కూలిపోయాయి.

18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారని అధికారులు పేర్కొంటున్నారు.. అంతేకాకుండా, తీవ్రంగా గాయపడిన ఐదుగురు పైగా కార్మికులను రక్షించి, అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, పేలుడు ప్రమాదంలో మరణించిన 18 మంది మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాణసంచా కర్మాగారం యజమానిని పోలీసులు ప్రశ్నించారు.. అంతేకాకుండా కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us