Dowry Harassment: వరకట్న దాహానికి మరో ఇల్లాలు బలి.. పెళ్లైన నాలుగు నెలలకే..

దేశంలో రోజురోజుకూ వరకట్న వేధింపుల పెరిగి పోతున్నాయి. డబ్బు పిచ్చిలో పడి అత్తింటి వారు ఇంటికొచ్చిన కొడలికి నరకం చూపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేధింపులకు గురిచేసి అత్తింటి వారే కొడళ్లను హత్య చేస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో వాళ్ల వేధింపులు తట్టుకోలేక కొడళ్లు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగు చూసింది. వరకట్న వేధింపులతో ఒక ఇళ్లాలు పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది.

Dowry Harassment: వరకట్న దాహానికి మరో ఇల్లాలు బలి.. పెళ్లైన నాలుగు నెలలకే..
Dowry Harassment

Updated on: Sep 11, 2025 | 7:42 PM

దేశంలో రోజురోజుకూ వరకట్న వేధింపుల పెరిగి పోతున్నాయి. గత నెలలో నోయిడాలో నిక్కీ భాటి హత్య, రెండు వారాల క్రితం బెంగళూరులో మరో ఇల్లాలు ఆత్మహత్య ఘటనలు మరువక ముందే మహారాష్ట్రలో మరో ఇల్లాలు వరకట్న వేధింపులు తాళలేక పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన మయూరి గౌరవ్ తోసర్ (23) అనే యువతికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుంచే ఆమె అత్తమామలు, నిరంతరం ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవారని, డబ్బు డిమాండ్ చేసేవారని ఆ మహిళ తల్లిదండ్రులు ఆరోపించారు.

నాలుగు నెలల కాలంలో కుటుంబంతో రాజీపడటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ, తమ కూతురిపై అత్తింటి వారి వేధింపులు తగ్గలేవని వారు ఆరోపించారు. వారి వేధింపులు తాళలేకనే మయూరి తన పుట్టిన రోజు జరిగిన తర్వాత రోజూ ఆత్మహత్యకు పాల్పడిందని వారు చెప్పుకొచ్చారు. తన కూతురి చావుకు కారణమైన ఆమె అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.