Corona Updates: ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,582 కరోనా పాజిటివ్‌ కేసులు, 850 మంది మృతి

|

May 13, 2021 | 11:10 PM

Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా మహారాష్ట్రలో అయితే పాజిటివ్‌..

Corona Updates: ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 42,582 కరోనా పాజిటివ్‌ కేసులు, 850 మంది మృతి
Follow us on

Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా మహారాష్ట్రలో అయితే పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,582 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 850 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఇదే సమయంలో 54,535 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 5,33,294 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు ప్రస్తుతం 88.34శాతంగా ఉండగా, మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,69,292 చేరుకోగా, 78,857 మంది మరణించారు.

కాగా, ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, అప్పుడే కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు, అధికారులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 4,693 కరోనా కేసులు.. 33 మంది మృతి..

Corona Vaccine for Children: కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..