MPLను ప్రారంభించిన మహారాయమన్ సింధియా! IPL తరహాలోనే ప్రతి డాట్‌ బాల్‌కు ఒక మొక్క

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 12వ తేదీన MPL 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతోంది. ఈ టోర్నీలో 7 పురుషుల జట్లుm 3 మహిళా జట్లు పాల్గొంటాయి. ప్రతి డాట్ బాల్‌కు ఒక మొక్క నాటే "MPL గ్రీన్ ఇనిషియేటివ్" ప్రారంభించబడింది. MPL గేమింగ్ యాప్ కూడా ప్రారంభించారు.

MPLను ప్రారంభించిన మహారాయమన్ సింధియా! IPL తరహాలోనే ప్రతి డాట్‌ బాల్‌కు ఒక మొక్క
Mahanaryaman Scindia

Updated on: May 31, 2025 | 1:59 PM

మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ అయిన MPL 2025.. ఈ సంవత్సరం 12వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ ఏడాది 7 పురుషుల జట్లు, 3 మహిళా జట్ల మధ్య పోటీ ఉంటుంది. అన్ని మ్యాచ్ లు గ్వాలియర్ లోని కొత్తగా నిర్మించిన మాధవ్ రావు సింధియా స్టేడియంలో జరగనున్నాయి. నిన్న ఇండోర్ లో టీమ్ రేవా జాగ్వార్స్ నిర్వహించిన కార్యక్రమంలో MPL చైర్మన్ మహానార్యమన్ సింధియా MPL గ్రీన్ ఇనిషియేటివ్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా MPL గేమింగ్ యాప్ ను కూడా ప్రారంభించారు.

ప్రతి డాట్ బాల్‌కు ఒక మొక్క

IPL తరహాలో MPLలో కూడా ప్రతి డాట్ బాల్ పై ఒక మొక్క నాటుతామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ హరిత విప్లవం అవసరమని, ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమం దేశం అంతటా జరుగుతోందని, MPL కూడా దాని బాధ్యతను అర్థం చేసుకుంటుందని సింధియా అన్నారు. అందువల్ల MPL రెండవ ఎడిషన్‌లో మధ్యప్రదేశ్ వాతావరణాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రతి డాట్ బాల్‌కు ఒక చెట్టును కూడా నాటుతామని అన్నారు. ఈ సందర్భంగా మహారాయమన్ సింధియా MPL క్రికెట్ గేమింగ్ యాప్‌ను కూడా ప్రారంభించారు. MPL క్రికెట్ క్లాష్‌ను ప్లే స్టోర్, ఐఫోన్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్‌లో ఆటగాళ్ళు తమ ప్రొఫైల్‌ను ఎంచుకోవచ్చు. వారికి ఇష్టమైన MPL జట్టును తమదిగా చేసుకోవచ్చు.

జ్యోతిరాదిత్య సింధియా సందేశం..

MPL గ్రీన్ ఇనిషియేటివ్, క్రికెట్ గేమింగ్ యాప్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. MPL నిర్వహణపై, గ్రీన్‌ ఇనిషియేటివ్‌పై కేంద్ర మంత్రి అన్ని జట్టు యజమానులు, ఆటగాళ్లను ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us