నో క్రాకర్స్‌ ప్లీజ్‌.. కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచన

| Edited By:

Feb 11, 2020 | 1:04 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయాన్ని మూటగట్టుకుంటోంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ పార్టీ క్యాడర్‌కు ఓ ముఖ్య సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి కానీ.. బాణాసంచా మాత్రం కాల్చకండని ఆదేశించారు. క్రాకర్స్‌ కాల్చే బదులు స్వీట్లు పంపిణీ చేయండని హితవు చెప్పారు. ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ […]

నో క్రాకర్స్‌ ప్లీజ్‌.. కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచన
Follow us on

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయాన్ని మూటగట్టుకుంటోంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ పార్టీ క్యాడర్‌కు ఓ ముఖ్య సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి కానీ.. బాణాసంచా మాత్రం కాల్చకండని ఆదేశించారు. క్రాకర్స్‌ కాల్చే బదులు స్వీట్లు పంపిణీ చేయండని హితవు చెప్పారు. ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.