AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం.. రింగ్‌ రోడ్డు పైనుంచి అండర్‌పాస్‌లో పడిపోయిన కారు! ఏడుగురు మృతి..

జైపూర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని, నీటితో నిండిన అండర్ పాస్ లో పడిపోయింది. హరిద్వార్ నుండి జైపూర్ కు తిరిగి వెళుతున్న బృందం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

తీవ్ర విషాదం.. రింగ్‌ రోడ్డు పైనుంచి అండర్‌పాస్‌లో పడిపోయిన కారు! ఏడుగురు మృతి..
Car Crash
SN Pasha
|

Updated on: Sep 14, 2025 | 6:54 PM

Share

శనివారం రాత్రి జైపూర్ రింగ్ రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. శివదాస్‌పురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రహ్లాద్‌పురా సమీపంలో ఈ సంఘటన జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, నీటితో నిండిన అండర్‌పాస్‌లోకి దాదాపు 16 అడుగుల లోతున పడిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాహనం హరిద్వార్ నుండి జైపూర్‌కు తిరిగి వెళుతుండగా మరణించిన బంధువు అంత్యక్రియలు నిర్వహించడానికి బాధితులు వెళ్లారు.

ప్రమాదం జరిగిన చాలా సేపటి వరకు ఎవరికీ కూడా ఈ ప్రమాదం గురించి తెలియలేదు. స్థానికులు అండర్‌పాస్‌లో దెబ్బతిన్న కారు మునిగిపోవడాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. వాహనాన్ని వెలికితీసేందుకు క్రేన్‌ను ఉపయోగించారు. కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. టాక్సీ డ్రైవర్ అయిన రామ్‌రాజ్ చితాభస్మ నిమజ్జనం కోసం ఆ బృందాన్ని హరిద్వార్‌కు తీసుకెళ్లి జైపూర్‌కు తిరిగి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి