వాళ్ళు క్రాస్ చేశారో ! ప్రతీకారం తప్పదు, చైనాకు భారత్ వార్నింగ్

| Edited By: Anil kumar poka

Sep 09, 2020 | 7:15 PM

లడాఖ్ లోని పాంగంగ్ సో సరస్సు ప్రాంతంలో బోర్డర్స్ ని దాటి చైనా దళాలు ముందుకు వచ్చిన పక్షంలో.. ప్రతీకారం తప్పదని ఇండియా తీవ్రంగా హెచ్ఛరించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని ఎదుర్కొనేందుకు సిధ్దంగా ఉన్నామని ప్రకటించింది.

వాళ్ళు క్రాస్ చేశారో ! ప్రతీకారం తప్పదు, చైనాకు భారత్ వార్నింగ్
Follow us on

లడాఖ్ లోని పాంగంగ్ సో సరస్సు ప్రాంతంలో బోర్డర్స్ ని దాటి చైనా దళాలు ముందుకు వచ్చిన పక్షంలో.. ప్రతీకారం తప్పదని ఇండియా తీవ్రంగా హెచ్ఛరించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని ఎదుర్కొనేందుకు సిధ్దంగా ఉన్నామని ప్రకటించింది. తాము కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందేందుకు వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తారని, ఇది టాప్ లీడర్ల వ్యూహమే తప్ప, స్థానిక కమాండర్లది కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి,. అసలు ఎందుకు ఇన్ని బలగాలు తరలిస్తున్నారో అర్థం కావడం లేదు.. లడఖ్ ఫింగర్- 4 ప్రాంతంలో 50 వేల నుంచి 70 వేల మంది చైనా సైనికులు మోహరించి ఉన్నారని  ఈ వర్గాలు వెల్లడించాయి. రెండు వారాలకు పైగా చైనా చర్యలు దక్షిణ పాంగంగ్ సరస్సు వైపే ఫోకస్ చేసి ఉన్నాయని,  ఫింగర్-4 ప్రాంతానికి, మన  సైనిక శిబిరాలకు మధ్య దూరం కేవలం కొన్ని వందల మీటర్లేనని సైనిక వర్గాలు కూడా ధృవీకరించాయి..

ఇలా ప్రతిరోజూ లడాఖ్ నియంత్రణ రేఖ వద్ద చైనా ఉద్రిక్త పరిస్థితిని సృష్టిస్తున్నప్పటికీ..భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.