
India Corona Updates: దేశంలో కరోనా ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా 20 మార్క్ దాటి నమోదవుతున్న కరోనా కేసులు.. మళ్లీ 20వేలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,166 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 214 మంది మరణించారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. 205 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,30,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 205 రోజుల్లో ఇదే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,53,475 కి పెరిగింది. మరణాల సంఖ్య 4,50,589 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 23,624 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,71,915 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. దీంతోపాటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 94,70,10,175 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
India reports 18,166 new COVID cases, 23,624 recoveries, and 214 deaths in the last 24 hours
Active cases: 2,30,971
Total recoveries: 3,32,71,915
Death toll: 4,50,589Vaccination: 94,70,10,175 pic.twitter.com/wCjCuy9KyC
— ANI (@ANI) October 10, 2021
Also Read: