Amit Shah: ఇంత పెద్ద మావోయిస్టు నేతను హతమార్చడం ఇదే తొలిపారి.. చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌ షా పోస్ట్!

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు హతమయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధికారికంగా ప్రకటించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో భారతదేశం మైలురాయి విజయాన్ని చేరుకుందని ఆయన అన్నారు.

Amit Shah: ఇంత పెద్ద మావోయిస్టు నేతను హతమార్చడం ఇదే తొలిపారి.. చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై అమిత్‌ షా పోస్ట్!
Amit Shah

Updated on: May 21, 2025 | 4:41 PM

ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్‌ మావోయిస్టు ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం. ఈరోజు, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో, మన భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుబెట్టాయి, వారిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజంపై భారత్ చేసిన మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రధాన పురోగతికి మన ధైర్యవంతులైన భద్రతా దళాలు, ఏజెన్సీలను నేను అభినందిస్తున్నాను.

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత, 54 మంది నక్సలైట్లను అరెస్టు అయ్యారు. 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని పంచుకోవడానికి కూడా సంతోషంగా ఉందన్నారు. మార్చి 31, 2026 లోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు.

కాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నారాయ‌ణ‌పూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంట‌ర్‌లో 28 మావోయిస్టులు మృతి చెందారు. అయితే చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజు(67) కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మాధ్ ప్రాంతంలో బ‌స‌వ‌రాజు ఉన్నార‌న్న స‌మాచారంతోనే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చుట్టిముట్టగా దాన్ని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రాతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 28 మంది మావోయిస్టులు హతం అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేచయండి..