
గల్ఫ్ దేశాలు ఏం కొనాలన్నా.. చివరికి మంచినీళ్లు కొనుక్కోవాలన్నా వాళ్ల దగ్గర ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ అమ్ముకోవాల్సిందే..! అంటే.. భారత్, ఇతర దేశాల నుంచి పళ్లు, కూరగాయలు వెళ్లాల్సిందే. ఒక వారానికి మించి గానీ గల్ఫ్కు సరుకులు వెళ్లకపోతే.. అక్కడ పుట్టేది ఆకలి రాజ్యమే. ఇది తెలిసి కూడా.. షిప్పులను రానివ్వడం లేదు. ఈ నష్టం ఒక్క గల్ఫ్కే కాదు.. మన రైతులకు కూడా పెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. అరటి పండ్లు, కోడిగుడ్ల గురించే మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. కాని, ఎంత మంది రైతులు, ఎన్ని పరిశ్రమలు ఎఫెక్ట్ అవబోతున్నాయో తెలుసా? ఇక ముహూర్తాలు మొదలైనట్టే కదా. కొత్త ఇంటిని ఎప్పుడు హ్యాండోవర్ చేస్తారని బిల్డర్ని అడిగారనుకోండి. తటపటాయించొచ్చు. చిన్న బిల్డర్లు ఎప్పుడు చేతికి తాళాలు ఇవ్వగలమో చెప్పలేని స్టేజ్లో ఉంటారు. కారణం.. యుద్ధం. రియల్ ఎస్టేట్ వరకూ వార్ ఎఫెక్ట్ తాకిందంటే.. ఇక మిగతా వాటి సంగతి? ఆలోచించక్కర్లేదు. అది కాదు, ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క రంగంపైనా ఇంపాక్ట్ చూపించబోతోంది. యుద్ధం కేవలం సరిహద్దులకు పరిమితం కాదు. అది సామాన్యుడి వంటింటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మూలాల వరకు పెను ప్రభావం చూపుతుంది. యుద్ధం వల్ల పెరిగే...