భారత పోస్టల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఆర్మీ వెటరన్‌కు త్రివర్ణ పతాకంతో అరుదైన గౌరవం!

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు హిమాచల్ ప్రదేశ్‌లో భారత పోస్టల్ విభాగం సాంకేతిక ప్రయోగం చేపట్టింది. మండి ప్రధాన తపాలా కార్యాలయం నుంచి రెహార్ధర్ బ్రాంచ్ పోస్టాఫీసు వరకు త్రివర్ణ పతాకాన్ని డ్రోన్ ద్వారా తరలించింది. అక్కడి నుంచి ఓ ఆర్మీ మాజీ సైనికుడికి జాతీయ జెండాను అందజేసింది. దేశభక్తి, సాంకేతికత కలయికగా నిలిచిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

భారత పోస్టల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఆర్మీ వెటరన్‌కు త్రివర్ణ పతాకంతో అరుదైన గౌరవం!
Indian Tricolour Flag To Veteran Army

Updated on: Aug 15, 2026 | 12:51 PM

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు హిమాచల్ ప్రదేశ్‌లో భారత పోస్టల్ విభాగం సాంకేతిక ప్రయోగం చేపట్టింది. మండి ప్రధాన తపాలా కార్యాలయం నుంచి రెహార్ధర్ బ్రాంచ్ పోస్టాఫీసు వరకు త్రివర్ణ పతాకాన్ని డ్రోన్ ద్వారా తరలించింది. అక్కడి నుంచి ఓ ఆర్మీ మాజీ సైనికుడికి జాతీయ జెండాను అందజేసింది. దేశభక్తి, సాంకేతికత కలయికగా నిలిచిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఆగస్టు 14న నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్‌గా పాల్గొన్నారు. డ్రోన్ ద్వారా త్రివర్ణ పతాక పార్సిల్‌ తరలింపును ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. ఇండియా పోస్ట్ తొలిసారిగా డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి త్రివర్ణ పతాకాన్ని నేరుగా దాని గ్రహీతకు చేరువ చేసిన కార్యక్రమంగా అధికారులు పేర్కొన్నారు.

మండి ప్రధాన తపాలా కార్యాలయం నుంచి త్రివర్ణ పతాకంతో కూడిన పార్సిల్‌ను డ్రోన్‌లో ఉంచి ప్రయాణాన్ని ప్రారంభించారు. నిర్ణీత మార్గంలో ప్రయాణించిన డ్రోన్ రెహార్ధర్ చేరుకున్న అనంతరం.. అక్కడి బ్రాంచ్ పోస్టాఫీసు సిబ్బంది పార్సిల్‌ను స్వీకరించారు. అనంతరం తపాలా శాఖ సిబ్బంది ఆ త్రివర్ణ పతాకాన్ని ఆర్మీ వెటరన్‌కు అధికారికంగా అందజేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాలకు సంప్రదాయ రవాణా, చివరి దశ డెలివరీ సవాలుగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం వేగవంతమైన, సమర్థవంతమైన డెలివరీకి ఉపయోగపడుతుందని ఈ ప్రయోగం చూపించింది.

దేశంలోని సుదీర్ఘ తపాలా వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడంలో భాగంగా మరిన్ని డ్రోన్ డెలివరీలను చేపట్టేందుకు భారత పోస్టల్ సిద్ధమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాంలో గుర్తించిన సుమారు 150 మార్గాల్లో డ్రోన్ ఆధారిత మెయిల్ ప్రసారాన్ని విస్తరించే ప్రణాళికలను తపాలా శాఖ వెల్లడించింది. మారుమూల ప్రాంతాలకు మెయిల్, పార్సిళ్లను వేగంగా చేరవేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, డెలివరీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆర్మీ వెటరన్‌కు త్రివర్ణ పతాకాన్ని డ్రోన్ ద్వారా అందించడం ఒక ప్రతీకాత్మక కార్యక్రమమే అయినప్పటికీ.. భవిష్యత్తులో దేశంలోని కఠినమైన భౌగోళిక ప్రాంతాలకు తపాలా సేవలను మరింత వేగంగా చేరవేసే సాంకేతిక మార్గానికి ఇది నాంది పలికింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us