
సరికొత్త లైటింగ్స్, లేజర్ షోలు, టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్ వంటి నగరాలు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి. 2025కు వీడ్కోలు చెబుతూ 2026కు ఘన స్వాగతం పలుకుతూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పరస్పరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని సందడి చేశారు.
దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక మంది అగ్ర నాయకులు 2026 సంవత్సరానికి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ప్రధాని మోదీ పోస్ట్ చేస్తూ, “మీ అందరికీ 2026 కి హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం మీకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలి. మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించాలి. మీ అన్ని ప్రయత్నాలలో నెరవేర్పును పొందాలి. మన సమాజంలో శాంతి మరియు ఆనందం కోసం ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.
2026 की आप सभी को बहुत-बहुत शुभकामनाएं। कामना करते हैं कि यह वर्ष हर किसी के लिए नई आशाएं, नए संकल्प और एक नया आत्मविश्वास लेकर आए। सभी को जीवन में आगे बढ़ने की प्रेरणा दे।
ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः।
स्वातन्त्र्यं कौशलं कान्तिर्धैर्यं मार्दवमेव च ॥ pic.twitter.com/vMhlHe3fGR
— Narendra Modi (@narendramodi) January 1, 2026
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, “మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం మీకు చాలా ఆనందం, మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని తీసుకురావాలి” అని అన్నారు.
आप सभी को नववर्ष की हार्दिक शुभकामनाएं। नया साल आपके जीवन में ढेर सारी खुशियां, अच्छा स्वास्थ्य और सफलताएं लेकर आए।
Wishing everyone a very Happy New Year 2026! pic.twitter.com/DqJYctGyM6
— Rahul Gandhi (@RahulGandhi) December 31, 2025
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దేశ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ రాశారు . సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఈ లేఖను షేర్ చేస్తూ ఆయన ఇలా రాశారు, “ప్రియమైన దేశప్రజలారా, ఈ శుభ నూతన సంవత్సరంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బలహీన వర్గాల హక్కులను కాపాడటానికి ఈ సంవత్సరాన్ని ఒక సామూహిక ఉద్యమంగా చేద్దాం, పని చేసే హక్కు, ఓటు హక్కు, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి హక్కు. మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను రక్షించడానికి, పౌరులకు అధికారం ఇవ్వడానికి, సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయడానికి మనం కలిసివద్దాం.” అని ఖర్గే పేర్కొన్నారు.
Dear fellow citizens,
On this joyful New Year, I extend my warmest greetings to all of you.
Let us make this year a mass movement to protect the rights of the vulnerable – the right to work, the right to vote, and the right to live with dignity. Together, let us safeguard our… pic.twitter.com/nUlm5Pfg72
— Mallikarjun Kharge (@kharge) December 31, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..