‘ ఆ నలుగురినీ నేనే ఉరి తీస్తా ‘ మీరట్ తలారి

| Edited By: Pardhasaradhi Peri

Jan 09, 2020 | 6:16 PM

నిర్భయ కేసులో నలుగురు దోషులను తానే ఉరి తీస్తానని ప్రకటించాడు యూపీలోని మీరట్ వాసి పవన్ జలాద్.. వారి మృతితో తనకు, నిర్భయ తలిదండ్రులకు, ఈ దేశానికి ఎంతో ఊరట కలుగుతుందని చెప్పాడు. ఉరికి సంబంధించిన రిహార్సల్స్ కోసం రానున్న రోజుల్లో తాను ఢిల్లీకి వస్తానని, బహుశా తనకు  ఈ మేరకు ఆదేశాలు అందవచ్చునని భావిస్తున్నానని ఆయన అన్నాడు. ఆ నలుగురు దోషుల ఉరితో నాకే కాదు.. నిర్భయ తలిదండ్రులకే కాక.. ఈ దేశానికి కూడా ఎంతో […]

 ఆ నలుగురినీ నేనే ఉరి తీస్తా  మీరట్ తలారి
Follow us on

నిర్భయ కేసులో నలుగురు దోషులను తానే ఉరి తీస్తానని ప్రకటించాడు యూపీలోని మీరట్ వాసి పవన్ జలాద్.. వారి మృతితో తనకు, నిర్భయ తలిదండ్రులకు, ఈ దేశానికి ఎంతో ఊరట కలుగుతుందని చెప్పాడు. ఉరికి సంబంధించిన రిహార్సల్స్ కోసం రానున్న రోజుల్లో తాను ఢిల్లీకి వస్తానని, బహుశా తనకు  ఈ మేరకు ఆదేశాలు అందవచ్చునని భావిస్తున్నానని ఆయన అన్నాడు. ఆ నలుగురు దోషుల ఉరితో నాకే కాదు.. నిర్భయ తలిదండ్రులకే కాక.. ఈ దేశానికి కూడా ఎంతో రిలీఫ్ లభిస్తుంది అని పేర్కొన్నాడు.’ నాకు ఎక్కువ ప్రాక్టీసు కూడా అవసరం లేదు.. ఉరి తాడును, ఉరి తీసే స్థలాన్ని నేను పరిశీలించాల్సి ఉంటుంది.. అలాగే ఆ నలుగురు  దోషుల ఎత్తు, బరువు తదితరాలను నేను కొలతలు తీసుకోవలసి ఉంటుంది..’  అని పవన్ జలాద్ వెల్లడించాడు. సాధ్యమైనంత త్వరగా ఆ దోషుల ఉరితీత జరగాలని నేనుకోరుకుంటున్నా అన్నాడాయన..