Gold Mines Auction: ఏపీ, యూపీలలో వేలానికి 13 బంగారు గనులు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!

2015లో మైనింగ్ చట్టానికి సవరణలు చేసిన తర్వాత వేలం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్ బ్లాకులను అమ్మకానికి పెట్టారు. వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి ఆదాయం వస్తోందని..

Gold Mines Auction: ఏపీ, యూపీలలో వేలానికి 13 బంగారు గనులు.. ఎప్పుడు.. ఎక్కడంటే..!
Gold Mines

Updated on: Aug 14, 2022 | 4:44 PM

Gold Mines Auction:  ప్రభుత్వం 13 బంగారు గనులను వేలం వేయనుంది.  యూపీ, ఆంధ్రప్రదేశ్‌లోని బంగారు గనులు వేలం ద్వారా అమ్మకానికి పెట్టనున్నారు. దేశ జిడిపిలో మైనింగ్ రంగం సహకారం పెంచేందుకు ప్రభుత్వం బంగారు గనులను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 13 బంగారు గనులను ప్రభుత్వం ఈ నెలలో వేలం వేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని 10 బ్లాకుల్లో ఐదు బ్లాకులను ఆగస్టు 26న, మిగిలిన ఐదు బ్లాకులను ఆగస్టు 29న వేలం వేసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మిగిలిన మూడు బంగారు గనులను ఈ నెలలో వేలం వేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా తేదీని ప్రకటించలేదు.

అధికారిక సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని 10 బ్లాకులలో, ఐదు ఆగస్టు 26 న వేలం వేయవచ్చునని సమాచారం. మిగిలిన ఐదు ఆగస్టు 29 న వేలం వేసే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని బంగారు గనులలో రామగిరి నార్త్ బ్లాక్, బాక్సంపల్లి నార్త్ బ్లాక్, బోక్సంపల్లి సౌత్ బ్లాక్, జవాకుల-ఎ బ్లాక్, జవాకుల-బి బ్లాక్, జవాకుల-సి బ్లాక్, జవాకుల-డి బ్లాక్, జవాకుల-ఇ బ్లాక్, జవాకుల-ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. ఈ బంగారు గనుల టెండర్ నోటీసును మార్చిలో జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మిగిలిన మూడు బంగారు గనులను ఈ నెలలో వేలం వేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా తేదీని ప్రకటించలేదు. రాష్ట్రంలోని మూడు బంగారు గనుల్లో రెండు సోన్‌భద్రలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఈ మూడు బంగారు గనుల కోసం మే 21న టెండర్‌లు జరిగాయి. దేశంలో మినరల్ బ్లాక్‌ల వేలం స్థిరీకరించబడిందని ప్రభుత్వం మేలో తెలిపింది. రాష్ట్రాలు ఆగస్టు 4న 199 మినరల్ బ్లాక్‌లను వేలం వేసాయి. గతేడాది 45 మినరల్ బ్లాకులకు వేలం నిర్వహించారు.

2015లో మైనింగ్ చట్టానికి సవరణలు చేసిన తర్వాత వేలం ద్వారా ఖనిజ బ్లాకుల కేటాయింపు ప్రారంభమైంది. గత ఆర్థిక సంవత్సరంలో 45 మినరల్ బ్లాకులను అమ్మకానికి పెట్టారు. వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి ఆదాయం వస్తోందని కేంద్రం తెలిపింది. ఖనిజాల వేలం నిబంధనలలో సవరణలు పోటీని ప్రోత్సహిస్తాయని, తద్వారా బ్లాకుల విక్రయంలో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని గనుల మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us