పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.. బంగారం 90వేలకు చేరువలో ఉండగా.. వెండి లక్ష మార్కు దాటి పరుగులు తీస్తోంది. అయితే.. మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాల ప్రకారం.. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. అయితే.. తాజాగా బంగారం ధర స్వల్పంగా పెరగగా.. సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. గురువారం (20 ఫిబ్రవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.80,360, 24 క్యారెట్ల పదిగ్రాముల గోల్డ్ ధర రూ.87,660 గా ఉంది. వెండి కిలో ధర రూ. 100,400 గా ఉంది. 10గ్రాముల బంగారంపై రూ.10 మేర ధర పెరగగా.. వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.80,460, 24 క్యారెట్ల ధర రూ.87,810 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.80,360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.80,360, 24 క్యారెట్లు రూ.87,660 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.80,360, 24 క్యారెట్ల ధర రూ.87,660 గా ఉంది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..