గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మూడు సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిందితులు

| Edited By: Anil kumar poka

Aug 18, 2020 | 11:06 AM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులైన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్, మరో నిందితురాలు స్వప్న సురేష్ ఇద్దరూ లోగడ 2017-18 సంవత్సరాల్లో మూడు సార్లు గల్ఫ్ దేశాలను విజిట్ చేశారని ఈడీ అధికారులు తెలిపారు.

గోల్డ్ స్మగ్లింగ్ కేసు, మూడు సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లిన నిందితులు
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితులైన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్, మరో నిందితురాలు స్వప్న సురేష్ ఇద్దరూ లోగడ 2017-18 సంవత్సరాల్లో మూడు సార్లు గల్ఫ్ దేశాలను విజిట్ చేశారని ఈడీ అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో వారు ఈ మేరకు డాక్యుమెంట్లను సమర్పించారు. వీరిద్దరితో బాటు ఇతర నిందితులైన సరిత్, సందీప్ నాయర్ లను జ్యూడిషియల్ రిమాండుకు పంపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 5 నుంచి నిందితుల్లో ముగ్గురు ఈడీ కస్టడీలో ఉన్నారు.

తను 2017 ఏప్రిల్ లో స్వప్నతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వెళ్లానని శివశంకర్ తెలిపారు. 2018 లో స్వప్న ఒమన్ దేశానికి వెళ్లగా అక్కడే శివశంకర్ ఉన్నాడని, ఇద్దరూ కలిస్ ఇండియాకు తిరిగి వచ్చారని ఈడీ అధికారులు వెల్లడించారు. అటు-నిందితులను ఈ నెల 26 వరకు కోర్టు జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.