AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికలొస్తున్నాయి మరి ! నేడు బెంగాల్, అస్సాం రాష్ట్రాలను విజిట్ చేయనున్న ప్రధాని మోదీ

అస్సాం, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు రానున్న ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాలపై ప్రధాని మోదీ దృష్టి సారించారు..

ఎన్నికలొస్తున్నాయి మరి ! నేడు బెంగాల్, అస్సాం రాష్ట్రాలను విజిట్ చేయనున్న ప్రధాని మోదీ
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 07, 2021 | 11:16 AM

Share

అస్సాం, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు రానున్న ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాలపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఆదివారం ఆయన ఈ రాష్ట్రాలను విజిట్ చేసి పలు ప్రాజెక్టులను లాంచ్ చేయనున్నారు. మొదట అస్సాంలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రెండు పెద్ద ఆసుపత్రుల నిర్మాణానికి ఆయన శంకు స్థాపన చేయనున్నారు. ఇక సోనిత్ పూర్ జిల్లాల్లో ‘అసోం మాలా’ పేరిట వివిధ రోడ్డు ప్రాజెక్టులను ఆయన లాంచ్ చేస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో బెంగాల్ లో వివిధ ఇన్ ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. హల్దియా జిల్లాలో సుమారు 1100 కోట్ల పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్మించిన ఎల్ పీ జీ ఇంపోర్ట్ టర్మినల్ ని మోదీ జాతికి అంకితం చేస్తారు. ప్రధానమంత్రి ఉర్జా గంగా ప్రాజెక్టులో భాగంగా 348 కి.మీ. ధోభీ-దుర్గాపూర్ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ సెక్షన్ ని కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు.

హల్దియా రిఫైనరీ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన రెండో కెటాలిటిక్ ఐసోడ్ వ్యాక్సింగ్ యూనిట్ కి మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ ఈ రెండు రాష్ట్రాలతో బాటు  ఝార్ఖండ్ రాష్ట్రానికి కూడా ప్రయోజనకరమైనవే.

Read More:

మా చీఫ్ గెస్టుగా రండి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఆహ్వానం

Superstar Rajinikanth: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు