2025 నాటికి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందిః నీతి ఆయోగ్ మాజీ సీఈఓ

ప్రపంచ వేదికపై భారత్ నిరంతరం మెరుగ్గా రాణిస్తోంది. 2025 నాటికి జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేశారు. ప్రస్తుత GDP ప్రకారం, అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారతదేశం ఐదోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.

2025 నాటికి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందిః నీతి ఆయోగ్ మాజీ సీఈఓ
Amit Kanth

Updated on: May 12, 2024 | 9:10 PM

ప్రపంచ వేదికపై భారత్ నిరంతరం మెరుగ్గా రాణిస్తోంది. 2025 నాటికి జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అంచనా వేశారు. ప్రస్తుత GDP ప్రకారం, అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారతదేశం ఐదోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2022లో భారత్ ఇప్పటికే బ్రిటన్‌ను అధిగమించింది. ఒక దశాబ్దం క్రితం, భారతదేశం GDP ప్రపంచంలో పదకొండవ అతి పెద్దది. ప్రస్తుతం భారతదేశ జీడీపీ దాదాపు 3.7 ట్రిలియన్ యుఎస్ డాలర్లు.

రికార్డు స్థాయిలో GST వసూళ్లు, గత మూడు త్రైమాసికాల్లో 8 శాతం కంటే ఎక్కువ GDP వృద్ధి, భారత కరెన్సీ రూపాయిలో తక్కువ పెరుగుదల కారణంగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందన్నారు అమితాబ్ కాంత్. ఫ్రాగిల్ అనే పదాన్ని 2013లో మోర్గాన్ స్టాన్లీ రూపొందించారు. భారతదేశంతో సహా ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహం కోసం ఉద్దేశించిందన్నారు.ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థలు బాగా లేవు. భారత్‌తో పాటు, ఆ గ్రూప్ దేశాలలోని ఇతర నాలుగు దేశాలు బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, టర్కియే ఉన్నాయన్నారు అమితాబ్ కాంత్.

2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశ జిడిపి 8.4 శాతం పెరిగింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ ప్రకారం, 2024లో ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. తన కొత్త దృక్పథంలో, IMF 2024 కోసం భారతదేశ వృద్ధి అంచనాను 6.5 శాతం నుండి 6.8 శాతానికి పెంచింది. భారత ఆర్థిక వ్యవస్థ 2022-23లో 7.2 శాతంగా ఉండగా, 2021-22లో 8.7 శాతంగా ఉంది.

అమితాబ్ కాంత్ ఒక భారతీయ బ్యూరోక్రాట్. గతంలో నీతీ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అతను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కేరళ కేడర్ నుండి తన వృత్తిని ప్రారంభించారు. G20 ప్రెసిడెన్సీ కోసం భారతదేశం కాంత్‌ను తన షెర్పాగా మార్చుకుంది. నిజానికి, G20ని హోస్ట్ చేయడంలో కాంత్‌ కీలక పాత్ర పోషించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Loading...
Unable to load recommendations.
Follow Us