Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (63) అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్‌..ఆస్పత్రిలో

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..
Nirmala Sitharaman

Updated on: Dec 26, 2022 | 2:45 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (63) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. నిర్మలా సీతారామన్‌ ఆదివారం మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఐతే.. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఫిబ్రవరి 1, 2023న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. నవంబర్ 21-28 వరకు వర్చువల్ మోడ్‌లో జరిగిన 2023-24 బడ్జెట్ ప్రీ-బడ్జెట్ సమావేశాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తోందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us