EPFO Interest Amount Credited To PF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త చెప్పింది కేంద్రం. సుమారు ఆరు కోట్ల మందికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీరేటును అందించనుంది. 2019-20 సంవత్సరానికి గానూ వడ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ గురువారం తెలిపారు. 2020లో కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితులు అనుకూలించనప్పటికీ.. పీఎఫ్ మొత్తంపై మొదటి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటంతో సంతోషంగా ఉందన్నారు.
గత ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వడ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్లో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కారణంగా మొదటి విడత 8.15 శాతం, రెండో విడతగా 0.35 శాతం చెల్లించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్ వివరాలు ఎస్ఎంఎస్, ఆన్లైన్ లో, అలాగే మిస్డ్ కాల్, ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.