హంద్వారాలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

| Edited By:

Aug 19, 2020 | 10:55 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. బుధవారం ఉదయం షోపియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ముగియక ముందే..హంద్వారాలో మరో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. జిల్లాలోని ఘనిపొర క్రల్‌గుండ్‌..

హంద్వారాలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us on

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. బుధవారం ఉదయం షోపియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ముగియక ముందే..హంద్వారాలో మరో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. జిల్లాలోని ఘనిపొర క్రల్‌గుండ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు తప్పించుకున్నారు. దీంతో సైన్య తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపడుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం