జమ్ముకశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. బుధవారం ఉదయం షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ ముగియక ముందే..హంద్వారాలో మరో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. జిల్లాలోని ఘనిపొర క్రల్గుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు తప్పించుకున్నారు. దీంతో సైన్య తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేపడుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#UPDATE Two unidentified terrorists killed in an encounter with security forces in Ganipora Kralgund area of Handwara district. A search is still going on: Jammu and Kashmir Police https://t.co/5B17ti5B1C
— ANI (@ANI) August 19, 2020
Read More :