పంజాబ్‌లో అర్ధరాత్రి భూప్రకంపనలు

పంజాబ్‌లో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. 2.50 గంటలకు పంజాబ్‌లోని టర్న్‌ తరన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టార్..

పంజాబ్‌లో అర్ధరాత్రి భూప్రకంపనలు
Earthquake

Updated on: Jul 30, 2020 | 11:51 AM

పంజాబ్‌లో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. 2.50 గంటలకు పంజాబ్‌లోని టర్న్‌ తరన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప తీవ్రత తక్కువగా నమోదవ్వడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, లదాఖ్ వంటి ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిళ్లడం లేదు.

 

Read More

భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు

వెస్ట్‌ బెంగాల్‌ కాంగ్రెస్ చీఫ్‌ గుండెపోటుతో మృతి

దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us