Delhi AIIMS: వర్షం నీటితో నిండిన ఢిల్లీ ఎయిమ్స్.. ఆగిన విద్యుత్ సరఫరా.. ఆపరేషన్ థియేటర్ సేవలు క్లోజ్

ఢిల్లీలో తొలి రుతుపవనాల ప్రభావం ఎయిమ్స్‌పై కూడా కనిపించింది. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో డజన్ల కొద్దీ శస్త్రచికిత్సలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరెంటు అంతరాయంతో న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి వేయాల్సి ఉండగా న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లు మాత్రం ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు శస్త్రచికిత్స జరిగింది, రాత్రంతా శస్త్రచికిత్స కొనసాగింది.

Delhi AIIMS: వర్షం నీటితో నిండిన ఢిల్లీ ఎయిమ్స్.. ఆగిన విద్యుత్ సరఫరా.. ఆపరేషన్ థియేటర్ సేవలు క్లోజ్
Delhi Aiims Hospital

Updated on: Jun 29, 2024 | 9:32 AM

వేసవి నుంచి ఉపశమనం ఇస్తూ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఋతుపవనాలు ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కురిసిన వర్షం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఆపరేషన్‌ థియేటర్లు కూడా ప్రభావితమయ్యాయి. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో డజన్ల కొద్దీ శస్త్రచికిత్సలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆసుపత్రిలోని స్టోర్ రూమ్ కూడా వర్షపు నీటితో నిండిపోయిందని వాపోతున్నారు. విద్యుత్ అంతరాయంతో న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి వేయాల్సి వచ్చింది. న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లు మాత్రం ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు శస్త్రచికిత్స జరిగింది, రాత్రంతా శస్త్రచికిత్స కొనసాగింది.

AIIMS అధికార ప్రతినిధి డాక్టర్ రీమా దాదా తెలిపిన వివరాల ప్రకారం.. AIIMSలోని న్యూరోసర్జరీ విభాగానికి చెందిన అన్ని ఆపరేషన్ థియేటర్లు పని చేస్తున్నాయని.. అయితే శుక్రవారం శస్త్రచికిత్స జరగని రోగులకు రాత్రి ఆపరేషన్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

వర్షం కారణంగా ఎయిమ్స్ ట్రామా సెంటర్ పరిస్థితి దారుణంగా ఉందని.. శస్త్ర చికిత్సలు మొదలు పెట్టిన అనంతరం సమాచారం అందజేస్తామని ఎయిమ్స్‌ యంత్రాంగం పేర్కొంది. వాస్తవానికి AIIMS ట్రామా సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్ నీటితో నిండిపోయింది. దీని కారణంగా మొత్తం భవనానికి విద్యుత్ సరఫరా నిలిపివేయవలసి వచ్చింది. విద్యుత్ లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆస్పత్రిలోని స్టోర్ రూం కూడా వర్షపు నీటితో నిండిపోయింది.

ఆసుపత్రి సేవలకు అంతరాయం కలుగుతుందని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులు సఫ్దర్‌జంగ్ , ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని ఎయిమ్స్ తన ప్రకటనలో పేర్కొంది. అయితే చిన్న పాటి వర్షానికే దేశంలోని అగ్రశ్రేణి ఆసుపత్రులలో ఒకటైన ఎయిమ్స్ పరిస్థితి ఇలా ఉంటే.. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి చికిత్స కోసం వచ్చే రోగుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తింది.

 

నీటితో నిండిన ఢిల్లీ
దేశ రాజధానిలో శుక్రవారం కురిసిన వర్షం సామాన్య జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వర్షం సంబంధిత ఘటనల్లో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాల ప్రభావంతో తెల్లవారుజాము నుంచి వర్షాలు కురవడంతో ఢిల్లీ తట్టుకోలేక పూర్తిగా ధ్వంసమైంది. ఆఫీసులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమై ఇళ్లలోకి నీరు చేరింది. రుతుపవనాల తొలి వర్షం పరిపాలనను బట్టబయలు చేసింది. దీంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరికొకరు పరస్పరం బాధ్యులుగా వ్యవహరిస్తూ ఆరోపణలు చేసుకుంటున్నారు.

నీటి ఎద్దడిపై ఢిల్లీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే
ఢిల్లీలో నీటి ఎద్దడి గురించి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి మాట్లాడుతూ, చివరి వర్షం వరకు.. తాము నగరంలో సుమారు 200 హాట్‌స్పాట్‌లను గుర్తించామని.. వీటిలో 40 హాట్‌స్పాట్‌లు పీడబ్ల్యూడీ సీసీటీవీ నిఘాలో ఉన్నాయని వెల్లడించారు. ఢిల్లీలో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే నీటి మట్టం తగ్గడానికి సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో డ్రెయిన్ల సామర్థ్యం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు నదుల్లా కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నీటి ఎద్దడి సమస్యపై అత్యవసర సమావేశం నిర్వహించాం. దీనికి ఢిల్లీ ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు అధ్యక్షత వహించారు. ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఇందులో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us