
నాక్కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది.. ఇది తెలుగునాట పవర్స్టార్ సినిమా డైలాగైతే కావొచ్చు. సేమ్టైమ్ తమిళనాట అన్నామలై మేనరిజమ్ కూడా అదే. శాలువాలు కప్పించుకోడానికో, ఏదో ఒక కుర్చీ కోసం కుస్తీ పట్టడానికో, ఎమ్మెల్యే ఎంపీ అని కారుకి స్టిక్కర్ అతికించుకోడానికో నేను రాజకీయాల్లోకి రాలేదు.. యంగ్ తమిళనాడును ఆవిష్కరించడానికి, ద్రవిడ బిడ్డలకు బెటర్ లైఫ్ ఇవ్వడానికే వచ్చా..! తనకు టిక్కెట్ నిరాకరించడంపై తన మీదొస్తున్న ఊహాగానాలకు జవాబిస్తూ ఆరునెలల కిందట అన్నామలై ఇచ్చిన ప్రకటన ఇది. పొలిటికల్గా ఎదగాలంటే ఏం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు, ఎలా మాట్లాడితే జనానికి దగ్గరౌతామన్న క్లారిటీ కూడా ఉంది. ఏ ఒక్క శక్తీ నన్ను, నా పొలిటికల్ మేనరిజాన్నీ మార్చలేరు అన్నప్పుడు అన్నామలై తెగింపును చూసి టోటల్ తమిళనాడుకే ముచ్చటేసింది. కానీ, ఓట్ల దగ్గరే డామిట్ కథ అడ్డం తిరిగింది. తమిళ ఓటు మరో సైడు పడింది. పార్టీకి ఒకప్పుడు ఆపద్బాంధవుడుగా ఉన్న అన్నామలై ఇప్పుడు పార్టీని ఆపదలో వదిలేసి వెళ్లిపోతానంటున్నాడు. తొందరపడి నిర్ణయం తీసుకోకు, మనోళ్లతో నేనొచ్చి మాట్లాడతా అని అమిత్షా అంతటివాడే బుజ్జగించాడంటే అన్నామలై తిరుగుబాటు ఫలితం ఎంతన్నది అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్న జాతీయ పార్టీనే ఎదిరించి కొత్త పార్టీ...